రాష్ట్ర ముఖ్యమంత్రి రాజకీయ పరమైన మీటింగ్స్ కి తప్ప ప్రజల సమస్యలపై మీటింగ్ పెట్టడానికి తీరిక లేదని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ మండిపడ్డారు. ఏడాది గడిచినా ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని, గ్రేటర్లోని ప్రజలకు తాగునీరు కూడా ఇవ్వడం లేదని, రెండు నెలలలో మంచినీరు ఇవ్వకపోతే జలమండలిని ముట్టడిస్తామన్నారు. శనివారం బీజేపీ కార్పొరేటర్లతో కలిసి జలమండలి ముందు ధర్నాకు దిగారు. భూగర్భ డ్రైనేజీ పనులు పూర్తి చేయాలని, ఎస్ఎన్డీపీ పనులు పూర్తి చేయాలని, వర్షాకాలం వచ్చిన పూర్తి కానీ పనులు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు తాగునీటి సరఫరా అందించాలంటూ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం దోస్తీ.. సమస్యలతో ప్రజల కుస్తీ అంటూ ప్లకార్డుల ప్రదర్శించారు. ఆ తర్వాత జలమండలి ఎండీతో ఎంపీ ఈటల రాజేందర్, కార్పొరేటర్లు సమావేశమయ్యారు. రెండు నెలల్లోగా శివారు ప్రాంతాల్లో మంచినీరు సరఫరా అందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఈటల రాజేందర్ హెచ్చరించారు.