- మంత్రి కోమటిరెడ్డిని కలిసిన మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి
- నల్లగొండ ఎంపి తన కొడుకు గెలిపించాలని
- మంత్రి కోమటిరెడ్డికి విజ్ఞప్తి చేసిన జానారెడ్డి
రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డిని, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి గురువారం బంజారాహిల్స్లోని మంత్రి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. నల్గొండ పార్లమెంట్ అభ్యర్ధిగా తన కుమారుడు కుందూరు రఘువీర్ రెడ్డిని ఆశీర్వదించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని జానారెడ్డి కోరారు. ఇరువురు నేతలు మూడు దశాబ్ధాలుగా రాజకీయాల్లో తమ మధ్య ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. రఘువీర్ కు తన సంపూర్ణ సహకారం ఉంటుందని, రుఘువీర్ ను భారీ మెజార్టీతో గెలిపించుకుందామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి జానారెడ్డితో తెలిపారు. జానారెడ్డితో పాటు నల్గొండ డిసిసి అధ్యక్షుడు శంకర్ నాయక్, దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్, నాగార్జున సాగర్ ఎమ్మెల్యే జయవీర్ తదితరులు పాల్గొన్నారు.