- పంప్హౌస్ ఇంజనీర్ల విచారణ
- మేడిగడ్డ అఫిడవిట్ల పరిశీలిస్తున్న జస్టిస్ పిసి ఘోస్
కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో జస్టిస్ పి.సి. ఘోస్ కమిషన్ వేగం పెంచింది. ఇందులో భాగంగా ప్రాజెక్టులోని పంప్ హౌస్లకు చెందిన నీటిపారుదల శాఖ ఇంజినీర్లను జస్టిస్ పీసీ ఘోష్ విచారణ చేయనున్నారు. ఈ మేరకు సంబంధిత అధికారులు హాజరుకావాలని ఆదేశాలు జారీచేసింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అన్ని దస్త్రాలు ఇవ్వాలని కమిషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కమిషన్ ఆదేశించింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని పంప్ హౌస్లకు చెందిన నీటిపారుదల శాఖ ఇంజనీర్లను కూడా జస్టిస్ పీసీ ఘోష్ విచారణ చేయనున్నారు. లక్ష్మీ, సరస్వతి, పార్వతి పంప్హౌస్ ఇంజినీర్లను విచారణ చేయాలని కమిషన్ నిర్ణయించింది. సోమవారం నుంచి మూడు పంప్ హౌస్లకు చెందిన సీఈ నుంచి ఏఈఈ వరకు ఇంజినీర్లు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు.
ఇంజినీర్ల నుంచి కూడా అవసరమైన సమాచారం, వివరాలు సేకరించడంతో పాటు ఆ తర్వాత వారి నుంచి కూడా అఫిడవిట్లు తీసుకోనున్నారు. అటు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని దస్త్రాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కమిషన్ ఆదేశించింది. రెండు వారాల్లోగా అన్ని దస్త్రాలు ఇవ్వాలని నీటిపారుదల శాఖకు స్పష్టం చేసింది. తుది నివేదికలు ఇవ్వాలని విజిలెన్స్, ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీకి జస్టిస్ పీసీ ఘోష్ తెలిపారు. ఈ మేరకు ఎన్డీఎస్ఏ చైర్మన్తో ఆయన మాట్లాడినట్లు సమాచారం. పుణెలోని సీడబ్ల్యూపీఆర్ఎస్సి కమిషన్ ఓ ప్రతినిధిని పంపి అధ్యయనం చేయించింది.
కమిషన్కు సహాయకారిగా ఉండేందుకు వివిధ సంస్థల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ సభ్యులతో జస్టిస్ పీసీ ఘోష్ సమావేశమయ్యారు. కమిటీ ఇప్పటికే ఆనకట్టలను అధ్యయనం చేసినందున ఆ అంశాలతో నివేదిక ఇవ్వాలని కమిషన్ ఆదేశించింది. నీటిపారుదల శాఖ ఇంజనీర్లు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు ఇప్పటి వరకు ఇచ్చిన అఫిడవిట్ల పరిశీలన కొనసాగుతోంది. వాటి పరిశీలన తర్వాత అవసరమైన వారికి నోటీసులు జారీ చేసి విచారణ చేయనున్నారు.