Sunday, April 20, 2025

కాళేశ్వరం అంతా కేసీఆర్​ ప్లానే

  • ఇంజినీర్ల రిపోర్ట్​ను పట్టించుకోలేదు
  • తుమ్మడిహట్టి దగ్గర ప్రపోజ్​ చేస్తే పక్కన పడేశారు
  • జ్యుడిషియల్​ కమిషన్​ ముందు రిటైర్డ్​ ఇంజినీర్ల నివేదిక

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కీలకమైన బ్యారేజీల నిర్మాణానికి మేడిగడ్డను ఎంపిక చేసింది కేసీఆర్​ అని, అంతా ఆయన చెప్పినట్టే జరిగిందని రిటైర్డ్​ ఇంజినీర్ల బృందం వెల్లడించింది. కాళేశ్వరం ప్రాజెక్ట్​లో లోపాలపై న్యాయ విచారణలో భాగంగా శనివారం హైదరాబాద్​లో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విశ్రాంత ఇంజినీర్లతో సమావేశమైంది. ఆనకట్ట నిర్మాణానికి మేడిగడ్డను మాజీ సీఎం కేసీఆర్ సూచించారని ఈ బృందం తెలిపినట్లు అధికారులు చెప్పారు. ప్రధాన నిర్మాణ సంస్థలతో పాటుగా ఈ ప్రాజెక్ట్​ నిర్మాణంలో సబ్ కాంట్రాక్టర్ల వ్యవస్థపై ఘోష్​ కమిషన్​దృష్టి సారించింది. వాటన్నింటి వివరాలు ఇవ్వాలని సైతం ఆదేశాలు జారీ చేసింది.

నివేదికను కమిషన్​కు ఇచ్చిన రిటైర్డ్​ ఇంజినీర్ల బృందం
కాళేశ్వరం ప్రాజెక్టులోని ఆనకట్ట నిర్మాణానికి మేడిగడ్డ అనువైన స్థలంగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్​ సూచించారని విశ్రాంత ఇంజినీర్లు విచారణ కమిషన్ జస్టిస్ పీసీ ఘోష్ ముందు చెప్పినట్లు వెల్లడైంది. కాళేశ్వరం ప్రాజెక్టు ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్.. రిటైర్డ్​ ఇంజినీర్లను ప్రశ్నించింది. దీనిలో భాగంగా 2015లో గోదావరి జలాలపై తాము ఇచ్చిన నివేదిక, సంబంధిత అంశాలను విశ్రాంత ఇంజినీర్ల కమిటీ సభ్యులు కమిషన్​కు వివరించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం 2015లో గోదావరి జలాల వినియోగంపై ఐదుగురు విశ్రాంత ఇంజినీర్ల కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి ఓ నివేదిక ఇచ్చిందని, విశ్రాంత ఇంజినీర్లు అనంత రాములు, వెంకటరామారావు, చంద్రమౌళి, శ్యాం ప్రసాద్ రెడ్డి, దామోదర్ రెడ్డి ఆ కమిటీలో సభ్యులుగా ఉన్నట్లు ఈ సందర్భంగా కమిషన్​కు వివరించారు. దీంతో నివేదికలోని అన్ని అంశాలపై విస్తృతంగా చర్చించారు.

ప్రాణహిత – చేవెళ్ల, కాళేశ్వరం ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలతో పాటు గోదావరి జలాల లభ్యత, కేంద్ర జల సంఘం పరిశీలనలు ప్రస్తావనకు వచ్చింది. ఆనకట్ట నిర్మాణానికి అనువైన స్థలంగా మేడిగడ్డను అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్​ సూచించారని విశ్రాంత ఇంజినీర్లు కమిషన్ ముందు చెప్పింది. అయితే, తుమ్మడిహట్టి దగ్గర ప్రతిపాదనలను తాము చేస్తూ ఇచ్చిన నివేదికపై మాజీ సీఎం కేసీఆర్, అప్పటి మంత్రి, అధికారులు సంతకాలు చేయలేదని కూడా వారు కమిషన్​ముందు వివరించారు.

కాగా, ఇంజినీర్లు ఇచ్చిన నివేదికను ఇటీవల శాసనసభ సమావేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. మేడిగడ్డ నుంచి గోదావరి జలాల ఎత్తిపోత సబబు కాదని కమిటీ సూచించిందని, దాన్ని తొక్కిపట్టి కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టారని వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జస్టిస్ పీసీ ఘోష్ విశ్రాంత ఇంజనీర్లతో సమావేశమయ్యారు. ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టును పక్కన పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టును ఎందుకు చేపట్టారన్న విషయమై కమిషన్ ఆరా తీసింది. అందుకు సంబంధించిన అంశాలను విశ్రాంత ఇంజనీర్ల దగ్గర విచారించిన కమిషన్​కు.. అప్పటి సీఎం కేసీఆర్​ ప్లాన్​మొత్తాన్ని వివరించారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com