శాంతి చర్చలకు వస్తాం.. కేంద్రానికి మావోయిస్టుల లేఖ
కేంద్ర మావోయిస్ట్ పార్టీ కీలక నిర్ణయం తీసుకున్నది. కొంతకాలం తుపాకుల పక్కన పెడుతామని ప్రకటించింది. మావోయిస్ట్ రహిత భారత్ నినాదంతో ఆపరేషన్ కగార్ను కేంద్ర ప్రభుత్వం దూకుడుగా ముందుకు తీసుకెళ్తోంది. ఈ క్రమంలో గత 100 రోజుల్లో వివిధ ఎన్కౌంటర్లలో 120 మందికి పైగా మావోయిస్టులను భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. అదే సమయంలో మరోపక్క భారీగా దళ సభ్యులు లొంగిపోతున్నారు. ఈ క్రమంలో కేంద్ర, పలు రాష్ట్ర ప్రభుత్వాల ముందు మావోయిస్టులు శాంతి చర్చల ప్రతిపాదన ఉంచారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి చర్చలకు ప్రతిపాదిస్తే.. కాల్పుల విరమణకు సిద్ధమంటూ మావోయిస్ట్ కేంద్ర కమిటీ సంచలన ప్రకటన చేసింది. ‘‘ప్రజల కోసం ఎప్పుడైనా శాంతి చర్చలకు సిద్ధం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించాలి. ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలి. ఛత్తీస్గఢ్, ఒడిషా, జార్ఖండ్, మధ్యప్రదేశ్, తెలంగాణలో జరుపుతున్న హత్యాకాండను ఆపాలి.’’ అంటూ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో లేఖను విడుదల చేశారు. శాంతి చర్చల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూల వాతావరణం కల్పించాలి. అప్పుడు మేం వెంటనే కాల్పుల విరమణ పాటిస్తాం’’ అని మావోయిస్ట్ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో లేఖ విడుదలైంది. దీనికి కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి. దీంతో వరుస ఎన్కౌంటర్లతో ఉద్యమ నేతలను కోల్పోతున్న మావోయిస్ట్ పార్టీ.. ఒక్కసారిగా తమ స్వరం మార్చినట్లుగా మారింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడే మావోయిస్టులు తాజాగా శాంతి చర్చల అంశాన్ని తెరపైకి తెచ్చారు. కేంద్రంతో చర్చలకు తాము సిద్ధమని ఓ లేఖ విడుదల చేశారు. నక్సల్ ప్రభావిత రాష్ట్రాలైన ఛత్తీస్ ఘడ్, ఒరిస్సా, మధ్యప్రదేశ్, తెలంగాణ, జార్ఖండ్, మహారాష్ట్రలలో తక్షణమే కేంద్ర బలగాలు కాల్పులను నిలిపివేయాలని సదరు లేఖలో కోరారు. తాము కూడా కాల్పుల విరమణను పాటించి శాంతి చర్చలకు సానుకూల వాతావరణాన్ని కల్పిస్తామని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి చర్చలకు ముందుకొస్తే అందుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ మావోయిస్టులు ఆ లేఖలో స్పష్టం చేశారు.