Tuesday, May 20, 2025

కాళోజీ అవార్డుల ఎంపికకు కమిటీ

ప్రతిష్టాత్మక ‘కాళోజీ నారాయణరావు అవార్డు’కు అర్హులైన సాహితీవేత్తను ఎంపిక చేసేందుకు ప్రముఖ కవి అందెశ్రీ గారి అధ్యక్షతన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ మొదటి సమావేశం మంగళవారం సచివాలయంలో జరిగింది. అందెశ్రీ అధ్యక్షతన కమిటీ సభ్యులు ఏనుగు నర్సింహారెడ్డి, సంగనభట్ల నర్సయ్య, పొట్లపల్లి శ్రీనివాస్, మెంబర్ కన్వీనర్ మామిడి హరికృష్ణ సమావేశంలో పాల్గొన్నారు.

ప్రజాకవి ‘పద్మభూషణ్ ‘కాళోజీ నారాయణరావు గారి పేరుమీద ఏటా సాహితీ అవార్డు కింద గ్రహీతను సన్మానించి, జ్ఞాపికతో పాటు రూ.1,01,116 నగదును అందజేస్తారు. ఈ అవార్డుకు దాదాపు 40 మంది సాహితీవేత్తలు దరఖాస్తు చేసుకున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com