మంచు మోహన్ బాబు మంచు విష్ణు నిర్మించినటిస్తున్న కన్నప్ప సినిమాపై సనాతన ధర్మాన్ని, హిందూ దేవి దేవతలను, బ్రాహ్మణులను కించపరిచే సన్నివేశాలు మనోభావాలు దెబ్బ తినే విధంగా చరిత్రను, పురాణాలను, వక్రీకరించి కన్నప్ప సినిమా నిర్మించారని బ్రాహ్మణ చైతన్య రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ ఏపీ హైకోర్టులో రిట్ దాఖలు చేసిన విషయం విదితమే… అయితే వేసవి సెలవు తర్వాత గౌరవ హైకోర్టు సోమవారం నుంచి ప్రారంభమైంది. మంగళవారం కన్నప్ప సినిమా కేసు ఏపీ హైకోర్టులో బెంచ్ మీదకి వచ్చింది. దాని సందర్భంగా సెంట్రల్ ఫిలిం బోర్డ్ ఆఫ్ సర్టిఫికేషన్ ముంబై తరఫున అడ్వకేట్ హాజరు కావడం జరిగింది. వాది తరుపున ఉన్న అడ్వకేట్ కన్నప్ప సినిమా సెన్సార్ కాకుండానే గుంటూరులో జరిగిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో ఎన్ని అవరోధాలు అయినా సరే ఈనెల 27న సినిమా రిలీజ్ చేస్తామని తెలియజేసిన అంశంపై పత్రికల్లో వచ్చిన వార్తలని న్యాయస్థానం ముందు ఉంచారు. వెంటనే ఫిలిం సెన్సార్ బోర్డు పైన న్యాయస్థానం వారు ఆగ్రహం వ్యక్తం చేసింది. సినిమా సెన్సార్ స్క్రూట్ ని కూడా కాకుండా, సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వకుండా, హైకోర్టులో కౌంటర్ వేయకుండా సినిమా తేదీ ఎలా ప్రకటిస్తారని ప్రతివాది అయినా సెన్సార్ బోర్డ్ అడ్వకేట్ని ప్రశ్నించారు. త్వరలో కౌంటర్ వేస్తామని సెన్సార్ బోర్డు వారు తెలియజేశారు. మిగిలిన ప్రతివాదులకు నోటీసులు అందిన ఎందుకు హాజరు కాలేదని, కౌంటర్ ఎందుకు వేయలేదని, కోర్టు, సెన్సార్ వారి అనుమతి లేకుండా సినిమా రిలీజ్ చేస్తే కోర్టు వారు చట్ట ప్రకారం ఏం చేయాలో అదే చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేసి ఈనెల 27వ తేదీకి కన్నప్ప కేసును వాయిదా వేశారు. అదే రోజున ప్రపంచవ్యాప్తంగా కన్నప్ప సినిమా రిలీజ్ డేటు మంచు కుటుంబం ప్రకటించడం గమనార్హం.