మంచు ఫ్యామిలీ టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు మోహన్ బాబు. ఇక ఆయన వారసులుగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు మంచు విష్ణు, మంచు మనోజ్, మంచు లక్ష్మీ. ప్రేక్షకుల్లో గుర్తింపు పొందినప్పటికీ.. స్టార్ హీరో రేంజ్ కి ఎదగలేకపోయారు. రీసెంట్గా మంచు లక్ష్మి కన్నప్ప సినిమా గురించి మాట్లాడుతూ… తన పర్సనల్ విషయాల గురించి ఓపెన్ అయ్యారు. ఈ సినిమా కోసం దాదాపు పది సంవత్సరాలు నుంచి విష్ణు కష్టపడుతున్నారని చెప్పారు. కన్నప్ప సినిమాలో ఎందుకు నటించలేదు అనే ప్రశ్న ఎదురైంది. అందుకు బదులిస్తూ.. నన్ను ఎందుకు ఈ సినిమాలో తీసుకోలేదో మీరు విష్ణుని అడగాలి అంటూ సమాధానం ఇచ్చారు. నేను నటిస్తే ఈ సినిమాలో నటించిన వారు ఎవరు కనిపించరని సరదాగా వ్యాఖ్యానించారు. తాను చేయగలిగే పాత్ర లేకపోవడంతోనే విష్ణు తనకు ఆ సినిమాలో అవకాశం ఇవ్వలేదని తెలిపారు. మేమంతా కలిసి సినిమాలో నటిస్తే అది ఫ్యామిలీ సినిమా అవుతుంది అంటూ చెప్పుకొచ్చారు. అలానే తన మద్దతు తన వాళ్లకు ఎప్పుడూ ఉంటుంది అంటూ స్పష్టం చేశారు. దీంతో ఆమె చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. మంచు విష్ణు పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే భారీ స్థాయిలో “కన్నప్ప” చిత్రంలో నటిస్తూ, నిర్మిస్తున్నారు. ఈ చిత్రం జూన్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మూవీలో రుద్ర అనే పాత్రలో ప్రభాస్ కనిపించనున్నారు. మోహన్ బాబు, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్, ఐశ్వర్య రాజేష్, శరత్ కుమార్.. బ్రహ్మానందం, మధుబాల, ముఖేష్ రిషి సహా పలువురు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.