బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ మాజీ భర్త సంజయ్ కపూర్ ఇంగ్లాండ్లో గుండెపోటుతో 53 ఏళ్ల వయసులో మరణించారు. పోలో ఆడుతుండగా ఆయనకు గుండెపోటుకు గురయ్యారు. ఆట సమయంలో సంజయ్ అకస్మాత్తుగా నేలపై పడిపోయాడని సమాచారం. ఆయనను వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ వైద్యులు అతడిని కాపాడలేకపోయారు. ఆయన అంత్యక్రియల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కరిష్మా తర్వాత ప్రియా సచ్దేవ్ను వివాహం చేసుకున్న సంజయ్ కరిష్మా కపూర్, సంజయ్ కపూర్ 2003 సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. వారు 2016 సంవత్సరంలో విడాకులు తీసుకున్నారు. ఈ వివాహం నుంచి వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కూతురు సమైరా, కుమారుడు కియాన్ ఉన్నారు. కరిష్మాతో విడాకుల తర్వాత 2017 సంవత్సరంలో ఆయన మోడల్ ప్రియా సచ్దేవ్ను వివాహం చేసుకున్నారు. వారికి కూడా అజారియస్ అనే కుమారుడు ఉన్నాడు. సంజయ్తోప్రియాకు కూడా రెండో వివాహమే. ఆమెకు మొదటి వివాహం నుంచి సఫీరా అనే కుమార్తె ఉంది. ఆమె మొదటి వివాహం విక్రమ్ చత్వాల్తో జరిగింది. నటుడు, రచయిత సుహైల్ సేథ్ ఒక పోస్టులో సంజయ్ కపూర్ మరణ వార్తను ధ్రువీకరిస్తూ విచారం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో సంజయ్ మరణ వార్త నేపథ్యంలో ప్రజలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సంజయ్ కపూర్ ఒక ప్రసిద్ధ వ్యాపారవేత్త. ఆయన పోలో ఆటను చాలా ఇష్టపడేవాడు.