ఇవాళ సంగారెడ్డి జిల్లాలో మాజీ సీఎం కేసీఆర్ పర్యటించ నున్నారు. సుల్తాన్ పూర్ లోని బహిరంగ సభ నిర్వహిస్తున్నారు.
ఈ సభలో కేసీఆర్ పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించి లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరనున్నారు.
దీంతో, సుల్తాన్పూర్ బహిరంగ సభను లక్ష మందితో నిర్వహించేందుకు బీఆర్ఎస్ ఏర్పాట్లు చేసింది. మెదక్ పార్లమెంట్ పరిధి లోని సంగారెడ్డి, పటాన్చెరు, నర్సాపూర్, జహీరాబాద్ పార్లమెంట్ పరిధి లోని అందోల్, నారాయణఖేడ్, జహీరా బాద్ నియోజక వర్గాల నుంచి ప్రజలు హాజరు కానున్నారు.
యువత, రైతులు, మహిళలు ఎక్కువ సంఖ్యలో హాజరయ్యేలా బీఆర్ఎస్ ఏర్పాట్లు చేపట్టింది..