- కేసీఆర్ వందేళ్లు బతకాలి..
- అందుకే ఫాంహౌస్ నుంచి బయటకు రావడం లేదు..
- రాజకీయ భిక్ష పెట్టిన పాలమూరును కేసీఆర్ ఎండబెట్టారు
- మీరు అలాగే ప్రతిపక్షంలో, మేం ఇలాగే అధికార పక్షంలో ఉండాలి..
- రాజ్యాంగ స్ఫూర్తితోనే రాష్ట్రంలో పరిపాలన
- శాసనసభలో బిఆర్ఎస్ సభ్యులపై రేవంత్ రెడ్డి విమర్శలు
‘భారత రాజ్యాంగ స్ఫూర్తితోనే మనం వ్యవస్థలను నడుపుతున్నామని, 2022 బడ్జెట్ సమావేశాల్లో గత ప్రభుత్వం గవర్నర్ ప్రసంగం లేకుండానే సమావేశాలు నిర్వహించారని, మహిళా గవర్నర్ను అవమానించేలా వ్యవహరించారని . కానీ మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వ్యవస్థలను సంస్థలను గౌరవించుకుంటూ ముందుకు వెళుతున్నామన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సీనియర్లమని, పదేళ్లు మంత్రులుగా చేసినమని చెప్పుకునేవాళ్లు గవర్నర్ ప్రసంగాన్ని తప్పుబట్టారు. వాళ్లు వారి అజ్ఞానాన్నే తమ విజ్ఞానమని అనుకుంటున్నారు’ అని సీఎం ఎద్దేవా చేశారు. ఇది ప్రజా ప్రభుత్వం.. మేం రాజ్యాంగబద్ధంగా వ్యవస్థను గౌరవిస్తామని, సభ్యులు ప్రస్తావించిన అంశాలన్నీ దృష్టిలో పెట్టుకుంటామని వారి సూచనలు తీసుకునేందుకు మాకు ఎలాంటి అభ్యంతరం లేదని ముఖ్యమంత్రి అన్నారు.
పదేళ్ల విధ్వంసం, నియంతృత్వాన్ని పారదోలి ప్రజలు మార్పును కోరుకున్నారు… అందుకే ప్రజల ఆశీర్వాదంతో మేం ఇక్కడ ఉన్నామని చెప్పారు. తెలంగాణ ప్రజలు 70 శాతం వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు. భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసమే గతంలో తెలంగాణలో పోరాటాలు జరిగాయి. భూమి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం. రైతులకు రూ.20624 కోట్లు రుణమాఫీ చేసిన చరిత్ర మా ప్రభుత్వానిది. రైతులు ఆత్మగౌరవంతో బతికేలా చేసిన ఘనత మా ప్రభుత్వానిది. ఎన్నికలను అడ్డుపెట్టుకుని ఆనాటి ప్రభుత్వం రైతుబంధు ఎగ్గొడితే.. మేం అధికారంలోకి వొచ్చిన మొదటి మూడు నెలల్లో రూ. 7625 కోట్లు రైతు బంధు రైతుల ఖాతాల్లో వేశాం.
రైతు భరోసాను రూ. 12 వేలకు పెంచాం. భూమిలేని నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా ప్రతి కుటుంబానికి రూ. 12 వేలు అందిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం వ్యాపార సంస్థ కాదని ఆనాటి ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేయలేదు. వరి వేస్తే ఉరేనని మాట్లాడారు. కానీ మేం ధాన్యం కొనుగోలు చేసి రూ.1206 కోట్లు సన్న వడ్లకు బోనస్ అందించాం. కాళేశ్వరం లేకుండానే రైతులు 1 కోటి 56 లక్షలు మెట్రిక్ టన్నుల ధాన్యం పండించారు. రైతు కమిషన్ ఏర్పాటు చేసి రైతుల సమస్యలు పరిష్కరించే యత్నం చేస్తున్నాం. పోరాటాలు చేశామని చెప్పుకునే వారు ఆనాడు చంద్రబాబుకు మోకరిల్లి 299 టీఎంసీలు చాలని సంతకం పెట్టి తెలంగాణకు శాశ్వత మరణ శాసనం రాశారు.
మేం అధికారంలోకి రాగానే కేంద్రాన్ని కలిసి నీళ్ల కోసం కొట్లాడాం. వైఎస్ ఆశీర్వాదంతో కేంద్ర మంత్రి అయిన కెసీఆర్ పోతిరెడ్డిపాడు పొక్కను పెద్దది చేస్తుంటే చూస్తూ ఊరుకున్నది నిజం కాదా తెలంగాణ జిల్లాలను వలస జిల్లాలుగా మార్చి రైతులను పొట్టన పెట్టున్నారు. కెసిఆర్ కాంట్రాక్టర్లు ఇచ్చిన కమీషన్ల కోసం కక్కుర్తి పడి జూరాలను రెండు టీఎంసీ ల నుంచి ఒక టీఎంసీకి తగ్గించి… నీళ్లను శ్రీశైలంకి పంపించడం వల్ల ప్రాజెక్టును పూర్తి చేసినా నీళ్లు ఇవ్వలేని పరిస్థితి దాపురించింది. ఎస్ఎల్బీసీని నాలుగేళ్లలో పూర్తి చేయాల్సింది పదేళ్లయినా పూర్తి చేయకుండా నల్లగొండకు అన్యాయం చేశారు. ఎస్ఎల్బీసీ ప్రమాదానికి, ఎనిమిది మంది చావుకి కారణం అప్పటి బిఆర్ ఎస్ ప్రభుత్వమే.. కృష్ణా పరీవాహక ప్రాంతంలో పదేళ్లలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను ఎందుకు పూర్తిచేయలేదు. మా ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి వొస్తుందని బిఆర్ఎస్ సభ్యులందరూ సభ నుంచి వెళ్లిపోయారు. 15 నెలల్లో కెసిఆర్ సభకు కేవలం రెండు సార్లు మాత్రమే వొచ్చారు. ప్రభుత్వ జీతభత్యాలు తీసుకుని ప్రజలను వారి కర్మకు వదిలేసిన నాయకుడు కెసిఆర్. ఎస్ఎల్బీసీ, డిండి పూర్తి చేసి ఉంటే నల్లగొండ కష్టాలు తీరేది అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
కేసీఆర్ వొచ్చిన రోజే కృష్ణా జలాలపై చర్చ
కెసీఆర్ ఏ రోజు వొస్తే ఆరోజు కృష్ణా జలాలపై చర్చ పెడదామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. లెక్కలతో సహా నిరూపించడానికి మేం సిద్ధంగా ఉన్నాం. మాది తప్పయితే బీఆర్ఎస్ నాయకులకు నేను క్షమాపణ చెప్పడానికి సిద్ధం. ఈ సవాల్ కు కెసీఆర్ సిద్ధమా చెప్పాలి. రోజులు 10 టీఎంసీలు తరలించుకుపోయే ప్రాజెక్టులు పక్క రాష్ట్రం నిర్మిస్తుంటే కెసిఆర్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. ఒక సామాన్య రైతు గ్రీన్ ట్రిబ్యునల్ కు వెళితే… విధి లేని పరిస్థితుల్లో ఆనాటి ప్రభుత్వం ఇంప్లీడ్ అయింది. రోజమ్మ రొయ్యల పులుసు తిని విశ్వాసం చూపిన కెసిఆర్.. రాజకీయ భిక్ష పెట్టిన పాలమూరును పడావు పెట్టారని విమర్శించారు.
కెసీఆర్ ఏ రోజు వొస్తే ఆరోజు కృష్ణా జలాలపై చర్చ పెడదామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. లెక్కలతో సహా నిరూపించడానికి మేం సిద్ధంగా ఉన్నాం. మాది తప్పయితే బీఆర్ఎస్ నాయకులకు నేను క్షమాపణ చెప్పడానికి సిద్ధం. ఈ సవాల్ కు కెసీఆర్ సిద్ధమా చెప్పాలి. రోజులు 10 టీఎంసీలు తరలించుకుపోయే ప్రాజెక్టులు పక్క రాష్ట్రం నిర్మిస్తుంటే కెసిఆర్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. ఒక సామాన్య రైతు గ్రీన్ ట్రిబ్యునల్ కు వెళితే… విధి లేని పరిస్థితుల్లో ఆనాటి ప్రభుత్వం ఇంప్లీడ్ అయింది. రోజమ్మ రొయ్యల పులుసు తిని విశ్వాసం చూపిన కెసిఆర్.. రాజకీయ భిక్ష పెట్టిన పాలమూరును పడావు పెట్టారని విమర్శించారు.
కేసీఆర్ 100 సంవత్సరాల బతకాలి.
మీకు స్టేచర్ పైన ఉన్న ఆలోచన తెలంగాణ ఫ్యూచర్ పై లేదా? అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. బీఆర్ఎస్ మార్చురీలో ఉందని నేను మాట్లాడా.. కేసీఆర్ ను అనేంత కుంచిత బుద్ది నాకు లేదు. కేసీఆర్ 100 సంవత్సరాల బతకాలి. ఆయన ప్రతిపక్షంలో అక్కడ అలాగే ఉండాలి.. మేం అధికారపక్షంలో ఇక్కడ ఇలాగే ఉంటాం. రైతు సమస్యలపై కేసీఆర్ తో ఎపుడైనా చర్చకు సిద్ధం.
మీకు స్టేచర్ పైన ఉన్న ఆలోచన తెలంగాణ ఫ్యూచర్ పై లేదా? అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. బీఆర్ఎస్ మార్చురీలో ఉందని నేను మాట్లాడా.. కేసీఆర్ ను అనేంత కుంచిత బుద్ది నాకు లేదు. కేసీఆర్ 100 సంవత్సరాల బతకాలి. ఆయన ప్రతిపక్షంలో అక్కడ అలాగే ఉండాలి.. మేం అధికారపక్షంలో ఇక్కడ ఇలాగే ఉంటాం. రైతు సమస్యలపై కేసీఆర్ తో ఎపుడైనా చర్చకు సిద్ధం.
తెలంగాణలో మహిళలు నన్ను ఇంటి బిడ్డ గా చూసుకున్నారు…
ఆడ బిడ్డలకు స్వేచ్ఛ కల్పించాలని ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాం. రూ. 500 లకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. 5000 స్కూల్స్ ను బీఆర్ఎస్ మూసివేసింది..స్కూల్ యూనిఫాంలు కుట్టే బాధ్యత మహిళా సంఘాల కు ఇచ్చాం. 1000 ఆర్టీసీ బస్సులను మహిళా సంఘాలకు ఇచ్చాం. 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసే బాధ్యత మహిళా సంఘాలకు ఇచ్చాం. బతుకమ్మ చీరల పేరుతో దోపిడీ చేశారని వాటిని రద్దు చేశాం. మహిళా సంఘాల సభ్యులకు ఏడాదికి రెండు చీరలు ఇస్తున్నాం. కోటి 30 లక్షల చీరలు నేతన్నలకు ఆర్డర్ ఇచ్చాం. రేవంతన్నా అని ఆడబిడ్డలు నన్ను ఒక అన్నలా చూస్తున్నారు. ఒక భావోద్వేగంతో తెలంగాణను అభివృద్ధి చేయాలని మేం ప్రయత్నిస్తున్నాం.
ఆడ బిడ్డలకు స్వేచ్ఛ కల్పించాలని ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాం. రూ. 500 లకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. 5000 స్కూల్స్ ను బీఆర్ఎస్ మూసివేసింది..స్కూల్ యూనిఫాంలు కుట్టే బాధ్యత మహిళా సంఘాల కు ఇచ్చాం. 1000 ఆర్టీసీ బస్సులను మహిళా సంఘాలకు ఇచ్చాం. 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసే బాధ్యత మహిళా సంఘాలకు ఇచ్చాం. బతుకమ్మ చీరల పేరుతో దోపిడీ చేశారని వాటిని రద్దు చేశాం. మహిళా సంఘాల సభ్యులకు ఏడాదికి రెండు చీరలు ఇస్తున్నాం. కోటి 30 లక్షల చీరలు నేతన్నలకు ఆర్డర్ ఇచ్చాం. రేవంతన్నా అని ఆడబిడ్డలు నన్ను ఒక అన్నలా చూస్తున్నారు. ఒక భావోద్వేగంతో తెలంగాణను అభివృద్ధి చేయాలని మేం ప్రయత్నిస్తున్నాం.
అన్ని యూనివర్సిటీ వీసీ నియామకాల లిస్టు తీద్దాం.. మేం సామాజిక న్యాయం చేసింది నిజమో కాదో చూడండి. వాళ్ల విలాసవంతమైన జీవితాలకు భంగం కలిగించానని వాళ్లకు నాపై కోపం ఉండొచ్చు. కానీ కుల దురహంకారం ప్రదర్శించడం న్యాయమా? గవర్నర్, స్పీకర్లను గౌరవించరు. ఏకవచనంతో సంబోధించారు. పైగా సమర్థించుకుంటూ ధర్నాలు చేస్తున్నారు.. ఇదెక్కడి న్యాయం? కమీషన్లు ఇచ్చే కాంట్రాక్టర్లు.. దావత్ లు ఇచ్చే దోస్తులు వీళ్లేనా.. బీఆర్ఎస్ కు కావాల్సింది. నోటిఫికేషన్లు ఇచ్చామని చెప్పుకుంటున్న వాళ్ళు పదేళ్లలో ఎందుకు ఉద్యోగాలను భర్తీ చేయలేదు? దేశ చరిత్రలోనే 57,924 ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర మా ప్రభుత్వానిది. వాళ్ల హయాంలో 22.9 శాతం ఉన్న నిరుద్యోగ సమస్యను 18.1 శాతానికి తగ్గించామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ సభలో ఉండి వారి అనుభవంతో సూచనలు ఇస్తే అభ్యంతరం లేదని ఆయన స్పష్టం చేశారు.