Saturday, September 21, 2024

ప్రచారంలోకి గులాబీ బాస్

13 నుంచి పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం

టీఎస్, న్యూస్ : బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ 13వ తేదీ నుంచి పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇందులో భాగంగా ఆ రోజున చేవెళ్లలో భారీ బహిరంగ సభ నిర్వహించ నున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించిన వ్యూహంతో పోలిస్తే ఈసారి భిన్నంగా ముందుకు వెళ్తున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. బస్సు యాత్రలు, బహిరంగ సభలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని కేసీఆర్‌ భావిస్తున్నట్టు తెలిసింది. పార్టీ అధినేతతో పాటు కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌ రావు నిత్యం ప్రజల్లో ఉంటూ పార్టీ శ్రేణులను సమాయత్తం చేయాలని నిర్ణయించారు.

ప్రతి పార్లమెంట్‌ సెగ్మెంట్‌ లోని అన్ని అసెంబ్లీ నియోజక వర్గాలను కవర్‌ చేసేలా బస్సు యాత్ర చేస్తూనే అక్కడకక్కడా బహిరంగ సభల్లోనూ కేసీఆర్‌ ప్రసంగించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి. కేటీఆర్‌, హరీశ్‌ రావు ఇప్పటికే నియోజక వర్గ సన్నాహక సమావేశాల్లో పాల్గొంటూ పార్టీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేస్తున్నాయి.

ఒకట్రెండు రోజుల్లో..

వరంగల్‌ లోక్‌సభతో పాటు సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికలో బరిలోకి దిగే అభ్యర్థుల ఎంపిక కోసం కసరత్తు పూర్తి చేసినట్టు తెలిసింది. క్షేత్ర స్థాయి నుంచి అభిప్రాయాలు సేకరించిన గులాబీ దళపతి ఒకట్రెండు రోజుల్లో ఈ రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తారని సమాచారం.. మిగతా స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక ఇప్పటికే పూర్తయింది.

కాంగ్రెస్‌, బీజేపీ వైఫల్యాలపై ఫోకస్‌..

కాంగ్రెస్‌ అధికారం లోకి వచ్చిన నాలుగు నెలల్లోనే అన్ని వర్గాలు ఎలా నిర్లక్ష్యానికి గురయ్యాయి.? వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు ఎలా నిర్వీర్యమవు తున్నాయి.? కాంగ్రెస్‌ 120 రోజుల పాలన, కేంద్రంలో బీజేపీ పదేండ్ల పాలన రాష్ట్రం ప్రయోజనాలకు గొడ్డలి పెట్టుగా ఎలా మారింది.? వంటి అంశాలతో కేసీఆర్‌ ఎన్నిక ఎన్నికల రణ క్షేత్రంలో దూకనున్నారు. వ్యవసాయ రంగాన్ని ప్రశ్నార్థకం చేసిన రాష్ట్ర ప్రభుత్వంపై ఇటీవల నల్లగొండ, కరీంనగర్‌ సభల్లో కేసీఆర్‌ దుమ్మెత్తి పోశారు. దక్షిణ, ఉత్తర తెలంగాణ లలో నీళ్లు లేక ఎండిన పంట పొలాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి అన్నదాతకు ధైర్యం చెప్పారు..

కేసీఆర్‌ పొలం బాటే పోరు గీతం..

రాష్ట్రంలో మరే పార్టీకి లేని బలమైన పునాది తమకు ఉన్నదని, అదే తమకు కొండంత అండ అని గులాబీ దళం ధీమా ఉన్నది. మిగతా పార్టీలకు అవకాశవాద క్యాడర్‌ ఉంటే తమకు మాత్రం అంకుశం లాంటి క్యాడర్‌ ఉన్నదని కేసీఆర్‌ పలు సందర్భాల్లో పేర్కొన్నారు. ఇటీవల కేసీఆర్‌ నిర్వహించిన పొలం బాట కార్యక్రమం పార్టీ శ్రేణుల్లో మరింత ఆత్మై స్థెర్యాన్ని నింపాయి. స్వార్థం చూసుకునే కొందరు నేతలు పార్టీ విడిచి వెళ్లినా క్యాడర్‌ చెక్కు చెదరకుండా ఉన్నదని నల్లగొండ, కరీంనగర్‌ బహిరంగ సభలు, పొలం బాట కార్యక్రమాలు నిరూపించాయి. కేసీఆర్‌ నాలుగు నెలల్లో నాలుగు సార్లు ప్రజా క్షేత్రం లోకి వస్తేనే ప్రభుత్వం ఆగమాగం అవుతున్నదని, ఇక ఆయన నిత్యం ప్రజల్లో ఉంటే ఇక్కట్లు తప్పవని విశ్లేషకులు చెప్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular