Saturday, May 24, 2025

సిఎం రేవంత్‌రెడ్డితో కీరవాణి, ప్రజాకవి అందెశ్రీలు భేటీ

‘జయ జయహే తెలంగాణ’ గీతానికి
తుది మెరుగులు పూర్తి

సిఎం రేవంత్‌రెడ్డితో సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, ప్రజాకవి అందెశ్రీలు భేటీ అయ్యారు. జూన్ 02వ తేదీన జరుగనున్న రాష్ట్ర అవతరణ వేడుకలను పురస్కరించుకొని రాష్ట్ర అధికార గీతంగా ‘జయ జయహే తెలంగాణ’ పాటను అమల్లోకి తీసుకురానుండగా దానికి సంబంధించిన పాటను కీరవాణి సిఎం రేవంత్‌రెడ్డి ఎదుట పాడి వినిపించారు.

5 రోజుల క్రితం సిఎం రేవంత్ వీరిద్దరు భేటీ అయిన సందర్భంగా ‘జయ జయహే తెలంగాణ’ గీతానికి సంబంధించి తుది మెరుగులు దిద్దాలని సిఎం వారికి సూచించగా దానికి తగ్గట్టుగా వారు ఆ గీతానికి తగ్గట్టుగా బాణీలను సమకూర్చి ఆ పాటకు తుది మెరుగులు దిద్దారు. ఈ భేటీలో ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ముఖ్యమంత్రి సిపిఆర్‌ఓ అయోధ్యరెడ్డి తదితరులు ఉన్నారు

ప్ర‌దాన వార్త‌లు

కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com