-
వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలకు రండి
-
సిఎం రేవంత్ రెడ్డికి ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యుల ఆహ్వానం
వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలకు రావాలని సిఎం రేవంత్ రెడ్డికి ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ఆహ్వానం పలికారు. ఖైరతాబాద్ లోని గణేష్ నవరాత్రి ఉత్సవాలకు ఓ ప్రత్యేకత ఉంది. ప్రతి ఏటా ఇక్కడ పెద్ద విగ్రహం ఏర్పాటు చేసి వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఏడాది కూడా 70 అడుగుల పెద్ద విగ్రహాని నెలకొల్పి, వేడుకలు ఘనంగా జరుపుకోవాలని ఉత్సవ కమిటీ నిర్ణయంచింది. ఈ నేపథ్యంలో ఖైరతాబాద్లో జరిగే ఉత్సవాలకు హాజరు కావాలని సిఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు.
గురువారం జూబ్లీహిల్స్లోని సిఎం నివాసంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్తో పాటు గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ఇతర కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా అర్చకులు సిఎం రేవంత్ రెడ్డికి ఆశీర్వచనం అందజేశారు. అనంతరం దానం నాగేందర్ సిఎం కు శాలువ కప్పి సత్కరించారు. ఈ మేరకు గణేష్ నవరాత్రి ఉత్సవాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికను రేవంత్ రెడ్డికి అందజేశారు. ఉత్సవ కమిటీ సభ్యులు సిఎంకు పుష్పగుచ్ఛం అందజేసి, ఉత్సవాలకు తప్పక హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు.