ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ లో చేరిక!
బీఆర్ఎస్ నుంచి తిరిగి సొంతగూటికి సీనియర్ నేత కేకే చేరారు. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే నివాసంలో పార్టీలో చేరారు. సీఎం రేవంత్ సమక్షంలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఖర్గే. కాగా ఇటీవల కేశవరావు బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్లోకి రావాలని ప్రియాంక గాంధీ తనను ఆహ్వానించారని కేశవరావు అన్నారు.
ప్రియాంక ఆహ్వానం మేరకు తిరిగి కాంగ్రెస్లో చేరినట్టు చెప్పారు. కేకే వెంట సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జి దీపాదాస్ మున్షి, పలువురు నేతలు ఉన్నారు. కాగా ఇటీవల తన కూతురు హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి తో కలిసి కేశవరావు బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన విషయం తెలిసిందే.