- అంగరంగ వైభవంగా కొనకళ్ళ అభినందన సభ
- కొనకళ్ళను సన్మానించిన ఎంపి కేశినేని శివనాథ్
విజయవాడ : ఆర్టీసీ చైర్మన్ గా కొనకళ్ళ నారాయణరావు పదవీ బాధ్యతలు చేపట్టం ఎంతో సంతోషం వుంది. మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రారంభమయ్యే సమయంలో కొనకళ్ల నారాయణ ఆర్టీసీ చైర్మన్ గా వుండటం ఆనందంగా వుందని ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు. ఆర్టీసీ చైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన కొనకొళ్ళ నారాయణరావుకి శనివారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అభినందన సభ జరిగింది. ఈ సభలో పాల్గొన్న ఎంపి కేశినేని శివనాథ్ ముందుగా కొనకొళ్ళ నారాయణరావుకి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేయటంతో పాటు శాలువాతో సత్కరించారు.
అనంతరం ఎంపి కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఎన్డీయే కూటమి గెలుపు కోసం ఎన్నికల్లో అలుపు లేకుండా కొనకొళ్ళ నారాయణ శ్రమించారని కొనియాడారు. తనకి ఏ సమస్య వచ్చినా ముందుగా కొనకొళ్ళ నారాయణరావును కలిసి తగిన సలహా తీసుకుంటానన్నారు. గత పదేళ్ల నుంచి కొనకొళ్ళ కుటుంబంతో సత్ససంబంధాలు వున్నాయని తెలిపారు.
రాష్ట్రంలోనే అతి పెద్ద సంస్థ అయిన ఆర్టీసీ కొనకొళ్ళ నాయకత్వంలో మరింత ప్రగతి పథంలో నడుస్తుందని ఆకాంక్షించారు. అలాగే కొనకళ్ళ నారాయణరావు కి ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ పదవి ఇచ్చినందుకు ముఖ్య మంత్రి చంద్రబాబు కి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ అభినందన సభకి భారీ సంఖ్యలో కొనకొళ్ళ అభిమానులు తరలివచ్చారు.