Friday, October 18, 2024

తెలంగాణలో పెరగనున్న మద్యం ధరలు?

  • రాష్ట్రంలో మందుబాబులకు బిగ్ షాక్
  • మద్యం ధరలను పెంచాలని కోరుతున్న బ్రూవరీలు
  • మద్యం ధరలు 15 శాతం వరకు పెరిగే అవకాశం
  • మద్యంపై రూ.20 నుంచి రూ.150 వరకు పెరిగే అవకాశం
  • 2024 సెప్టెంబర్ 30 వరకు 2,838.92 కోట్ల అమ్మకాలు

తెలంగాణలోని మందుబాబులకు షాక్ ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ సిద్ధమైనట్టు తెలుస్తోంది. త్వరలోనే మద్యం ధరలకు భారీగా పెంచేందుకు పావులు కదుపుతున్నట్టు సమాచారం అందుతోంది. అందులో ముఖ్యంగా బీర్ల ధరలను గట్టిగానే పెంచనున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రానికి బీర్లు సరఫరా చేసే.. ఉత్పత్తి కేంద్రాలకు చెల్లించే ధరలను సర్కార్ రెండేళ్లకు ఒకసారి పెంచుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఈసారి వివిధ రకాల బ్రాండ్ల మీద 20 రూపాయల నుంచి 150 వరకు పెంచాలని బ్రూవరీలు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరినట్టు సమాచారం. ఈ మేరకు త్వరలోనే.. బీర్ల ధరల పెంపుపై రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

అయితే ప్రభుత్వం తీసుకోనున్న నిర్ణయంతో మద్యం ధరలు సుమారు 15 శాతం వరకు పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ మద్యం ధరలను 15 శాతం పెంచితే ఎక్సైజ్ శాఖను ప్రస్తుతం వచ్చే ఆదాయం కంటే అదనంగా మరో 5 వేల కోట్లు వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం మద్యం అమ్మకాల ద్వారా వస్తున్న ఆదాయాన్ని మరో రూ.5318 కోట్లు పెంచాలని ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకే ధరల పెంపు ప్రక్రియ సాగుతోందన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఇదిలా ఉంటే తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 2260 మద్యం దుకాణాలు ఉండగా 1171 బార్లు కూడా ఉన్నాయి. వీటన్నింటికీ రాష్ట్రంలో ఉన్న 6 బ్రూవరీల నుంచి బీర్లు సరఫరా అవుతుంటాయి. వీటన్నింటికీ సరఫరా చేసేందుకు ఈ 6 బ్రూవరీల నుంచి ప్రతి ఏటా 88 కోట్ల లీటర్ల బీరు ఉత్పత్తి అవుతోంది. అయితే ప్రతి సంవత్సరం దసరా పండుగ సమయంలో మద్యం అమ్మకాలు భారీగా పెరుగుతాయి. ఈసారి 10 రోజుల వ్యవధిలో రూ.1,100 కోట్లకు పైగా మద్యాన్ని మందుబాబులు తాగేశారు. అందులో ముఖ్యంగా 17.59 లక్షల బీర్ల కేసులు అమ్మకాలు జరిగినట్టు తెలుస్తోంది.

ధరలు 15 శాతం వరకు పెరిగే అవకాశం : మద్యం ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైనట్లుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి. మద్యం ధరలు పెంచాలని బ్రూవరీలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ప్రభుత్వం కూడా అందుకు సిద్ధంగా ఉందని తెలుస్తోంది. అదే జరిగితే ధరలు 15 శాతం వరకు పెరిగే అవకాశం కనిపిస్తోంది. సాధారణంగా ప్రభుత్వం ధరలను ప్రతి రెండేళ్లకోసారి పెంచుతుంది. వివిధ రకాల మద్యంపై రూ.20 నుంచి రూ.150 వరకు పెంచాలని బ్రూవరీలు ప్రభుత్వాన్ని కోరాయి. తెలంగాణలోని 6 బ్రూవరీల్లో ప్రతి సంవత్సరం 88 కోట్ల లీటర్ల బీరు ఉత్పత్తి అవుతోంది. మద్యం అమ్మకాల్లో ఈసారి కూడా హైదరాబాద్ ముందు నిలిచింది. సెప్టెంబర్ 30 వరకు రూ.2,838 కోట్ల మద్యం అమ్మకాలు జరగగా అక్టోబర్ నెల ప్రారంభం నుంచి 11వ తేదీ వరకు రూ రూ.1,100 కోట్ల విలువైన 10 లక్షల 44 వేల కేసుల మద్యం అమ్మకాలు జరిగాయని ఆబ్కారీ అధికారులు చెబుతున్నారు. 10 రోజుల వ్యవధిలో 17 లక్షల 59 వేల బీర్లు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

మోసం చేయడంలో రేవంత్ రెడ్డి ఘనుడు అన్న మంద కృష్ణ మాదిగ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular