తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు త్వరలో నోటిఫికేషన్ విడుదలవుతుందనే నేపథ్యంలో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. స్థానిక సంస్థల్లో ఏకగ్రీవాలు చెల్లవంటూ తీర్పునిచ్చింది. దీనిపై రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ బాధ్యత ఈసీదేనని స్పష్టం చేసింది. ఏకగ్రీవాలు లేకుండా ఒక్క నామినేషన్ నమోదైనా ‘నోటా’ను రెండో పోటీదారుగా పేర్కొంటూ ఎన్నిక నిర్వహించాలని పేర్కొంది.
ఈ విధానం హరియాణా, మహారాష్ట్రలో అమల్లో ఉందని సుప్రీం కోర్టు ఉటంకించింది. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలతో ఈసీ కూడా అప్రమత్తమైంది. రాష్ట్రాలకు దీనిపై పలు మార్గదర్శకాలు జారీ చేసింది. సుప్రీం కోర్టు ఆదేశాలపై ఈ నెల 12న రాజకీయ పార్టీలతో చర్చించాలని చెప్పడంతో.. రాష్ట్రంలో రాజకీయ పార్టీల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే, రాజకీయ పార్టీలు అంగీకరించినా.. లేకున్నా దీనిపై సుప్రీం కోర్టు ఆదేశాలను పాటించాలని ఈసీ భావిస్తున్నది.