రేపు లోక్ సభ ముందుకు వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లు రానుంది. ప్రస్తుతం అందరి దృష్టి రేపటి సభా సమావేశాలపై ఉంది. అన్ని పార్టీలు తమ ఎంపీలకు విప్ జారీ చేశాయి. ఈ నేపథ్యంలో, వక్ఫ్ బోర్డు సవరణ బిల్లులో తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన నాలుగు సవరణల్లో మూడు ఆమోదం పొందాయి. ఈ మేరకు ఓ పత్రిక వెల్లడించిన కథనం
ఆమోదం పొందిన సవరణలు:
1. ‘వక్ఫ్ బై యూజర్’గా నమోదైన ఆస్తుల పునః పరిశీలనకు అవకాశం లేదు. ఒకసారి వక్ఫ్ ఆస్తిగా నమోదయ్యాక, దానికి సంబంధిత పత్రాలు లేకున్నా దానిని వక్ఫ్ ఆస్తిగానే పరిగణిస్తారు.
2. కలెక్టర్కు తుది అధికారం ఉండదు.
3. డిజిటల్గా పత్రాలు సమర్పించేందుకు ఆరు నెలల గడువు పొడిగింపు.