Thursday, September 19, 2024

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ భేటీ

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ భేటీ అయ్యారు. గురువారం ఉదయం హైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాసంలో సిఎంను కలిశారు. ఈ సందర్భంగా ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని ముఖ్యమంత్రికి మందకృష్ణ మాదిగా విజ్ఞప్తి చేశారు. మందకృష్ణతో పాటు సిఎంను కలిసిన వారిలో మంత్రి దామోదర రాజనరసింహ, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, కవ్వంపల్లి సత్యనారాయణ, కాలె యాదయ్య, లక్ష్మీకాంతారావు, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, మాజీ ఎంపి పసునూరి దయాకర్ తదితరులు ఉన్నారు. కాగా, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎక్స్ వేదికగా ఈ ఫొటోలను పంచుకున్నారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ కలిశారని, ఎస్సీ వర్గీకరణ పై సుప్రీం కోర్టు తీర్పు అమలుపై ఈ భేటీలో చర్చించామని సిఎం రేవంత్ ఎక్స్ వేదికగా స్పష్టంచేశారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular