Tuesday, March 11, 2025

మన్మోహన్ సింగ్ కు భారత రత్న ఇవ్వాలి

ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఆయన విగ్రహం ఏర్పాటు

తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం

అసెంబ్లీ స్పెషల్ సెషన్

మాజీ ప్రధాని మన్మోహన్‌కు సంతాపం తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ అసెంబ్లీ స్పెషల్ సెషన్ ప్రారంభమైంది. సోమవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో అసెంబ్లీ ప్రారంభం అవ్వగా.. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ మృతిపై సంతాప తీర్మానం గురించి ప్రస్తావిస్తూ లీడర్ ఆఫ్ ది హౌస్ సీఎం రేవంత్ రెడ్డిని మాట్లాడవలసిందిగా కోరారు.
అనంతరం సీఎం రేవంత్ మాజీ ప్రధాని మరణం పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తున్నదని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నదని చెబుతూ తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అంతకుముందు మాజీ ప్రధాని భారతదేశానికి అందించిన సేవలను కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రధాని బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఆర్థిక వ్యవస్థను దేశాన్ని కష్టకాలంలో ముందుకు నడిపించిన తీరును సీఎం రేవంత్ ప్రశంసించారు.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com