Saturday, February 22, 2025

మార్చి 8న మహిళా రక్షణ కోసం ప్రత్యేక యాప్

హోం మంత్రి వంగలపూడి అనిత మహిళల రక్షణ కోసం ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. దీనికి సంబంధించి
డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా, ఇతర పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. బడ్జెట్ ప్రాధాన్యతలకు సంబంధించిన అంశాలతో పాటు రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల రక్షణ, తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. హెల్ప్ డెస్కుల ఏర్పాటుపై దిశానిర్దేశం చేశారు.

మార్చి 8న మహిళా దినోత్సవం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా మహిళల రక్షణ కోసం ప్రత్యేక యాప్ ను ప్రారంభించే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అంతకు ముందు విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ఆధ్వర్యంలో సాయి సాధన చిట్ ఫండ్ బాధితులు మంత్రి అనితను కలిశారు.

నరసరావుపేటలో సాయి సాధన చిట్ ఫండ్ ఇటీవల బోర్డు తిప్పేయడంతో సుమారు రూ.200 కోట్ల మేర మోసం జరిగిందని, బాధితుల్లో పేద, మధ్యతరగతి ప్రజలే ఎక్కువగా ఉన్నారని వివరించారు. బాధితులకు సరైన న్యాయం చేయాలని ఎమ్మెల్యే కోరారు. ఘటనలో నిందితులను అరెస్టు చేయడం జరిగిందని, త్వరలోనే బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

ప్ర‌దాన వార్త‌లు

తెలంగాణపై బీజేపీకి చిత్తశుద్ధి లేదని తేలిపోయిందన్న కవిత వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com