ఆంధ్రప్రదేశ్ లో భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది ప్రభుత్వం. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 13 జిల్లాలకు కలెక్టర్లను బదిలీ చేసింది ప్రభుత్వం.
విశాఖపట్నం జేసీకి కలెక్టర్గా అదనపు బాధ్యతలు
ఏలూరు జిల్లా కలెక్టర్గా కె.వెట్రిసెల్వి నియామకం
అల్లూరి జిల్లా కలెక్టర్ గా ఎం.విజయ సునీత
గుంటూరు జిల్లా కలెక్టర్గా ఎస్.నాగలక్ష్మి
తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గా పి.ప్రశాంతి
విజయనగరం జిల్లా కలెక్టర్ గా బి.ఆర్.అంబేడ్కర్
పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ గా సి.నాగరాణి
చిత్తూరు జిల్లా కలెక్టర్ గా సుమిత్కుమార్
కాకినాడ జిల్లా కలెక్టర్ గా సగలి షణ్మోహన్
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గా జి.సృజన
ప్రకాశం జిల్లా కలెక్టర్ గా తమీమ్ అన్సారియా
కర్నూలు జిల్లా కలెక్టర్ గా రంజిత్ బాషా
బాపట్ల కలెక్టర్గా ఆ జిల్లా జేసీకి పూర్తి అదనపు బాధ్యతలు
ప్రస్తుతం గుంటూరు కలెక్టర్గా ఉన్న వేణుగోపాల్ రెడ్డి జీఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశించింది ప్రభుత్వం. విశాఖపట్నం జిల్లా కలెక్టర్ మల్లికార్జున జీఏడీకి రిపోర్టు చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు.