హైదరాబాద్ మెట్రో టికెట్ ధరలను 20 శాతం పెంచిన తర్వాత ప్రయాణికుల నుండి వ్యతిరేకత రావడంతో, మెట్రో యాజమాన్యం 10 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. ఈ డిస్కౌంట్ మే 24 నుండి అమల్లోకి వస్తుంది. కనిష్ట ఛార్జీ రూ.11, గరిష్ట ఛార్జీ రూ.69గా నిర్ణయించారు. ప్రయాణికుల ఫీడ్బ్యాక్ ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నామని యాజమాన్యం తెలిపింది. ఈ తగ్గింపు పేపర్, క్యూఆర్ టోకెన్, డిజిటల్ టికెట్లు, స్మార్ట్ కార్డులకు వర్తిస్తుందని వెల్లడించారు. హైదరాబాద్ మెట్రో కొన్ని రోజుల క్రితం టికెట్ ధరలను 20 శాతం పెంచిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రయాణికుల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. టికెట్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సైతం దీనిపై సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు.
మెట్రో ధరలు తగ్గించకుంటే ట్రాఫిక్ పెరుగుతుందని తెలిపారు. ఇక ప్రయాణికుల అసహనం నేపథ్యంలో మెట్రో యాజమాన్యం దిగి వచ్చింది. పెంచిన ధరలపై 10 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. దీనిపై ప్రయాణికులు పెదవి విరుస్తున్నారు. డిస్కౌంట్ ఎప్పుడైనా ఎత్తి వేసే అవకాశం ఉందని.. అందుకే మెట్రో ఛార్జీలపై డిస్కౌంట్ కాకుండా.. ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా మెట్రో యాజమాన్యం.. డిస్కౌంట్ తర్వాత ఉండే కొత్త ధరల జాబితాను విడుదల చేసింది. ఆ వివరాలు.
మెట్రో కొన్ని రోజుల క్రితం టికెట్ ధరలను 20 శాతం పెంచి.. తాజాగా 10 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. దీంతో టికెట్ ధరలు మారాయి. పెంచిన ధరల ప్రకారం.. మెట్రోలో కనీస టికెట్ ఛార్జీలు రూ.10 నుంచి రూ.12లకు, గరిష్ట ఛార్జీ రూ.60 నుంచి 75కు పెరిగాయి. ఇప్పుడు పది శాతం డిస్కౌంట్తో కనిష్ట ఛార్జీ రూ.11, గరిష్ట ఛార్జీ రూ.69కి తగ్గింది. తగ్గిన ధరలు మే 24 నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించింది. పేపర్, క్యూఆర్ టోకెన్, డిజిటల్ టికెట్లు, స్మార్ట్ కార్డులన్నింటిపైన ఈ డిస్కౌంట్ వర్తిస్తుందని మెట్రో యాజమాన్యం తెలిపింది.
==
10 శాతం డిస్కౌంటు తర్వాత చార్జీలు
==
0-2 కి.మీ వరకు రూ.11.00 (ఇదే కనిష్ఠం)
2-4 కి.మీ వరకు రూ.17.00
4-6 కి.మీ వరకు రూ.28.00
6-9 కి.మీ వరకు రూ.37.00
9-12 కి.మీ వరకు రూ.47.00
12-15 కి.మీ వరకు రూ.51.00
15-18 కి.మీ వరకు రూ.56.00
18-21 కి.మీ వరకు రూ.61.00
21-24 కి.మీ వరకు రూ.65.00
24 కి.మీ ఆపైన రూ.69.00 (ఇదే గరిష్ఠ ఛార్జీ. ఉదాహరణకు ఎల్బీనగర్ నుంచి చివరి స్టేషన్ మియాపూర్ వరకు మెట్రో టికెట్ ధర 69 రూపాయలు అన్నమాట)
ప్రయాణికుల ఫీడ్బ్యాక్ ఆధారంగా కొత్తగా సవరించిన ఛార్జీలపై 10 శాతం డిస్కౌంటు ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నాం. తక్కువ ధరలోనే ప్రయాణించే అవకాశం కల్పించాలే ఈ నిర్ణయం తీసుకున్నాం. కొత్త ఛార్జీలు మే 24, 2025 నుంచి అమల్లోకి వస్తాయని ఈ సందర్భంగా మెట్రో యాజమాన్యం ఒక ప్రకటన విడుదల చేసింది.