Friday, September 20, 2024

టాలీవుడ్ డైరెక్టర్ దర్శకత్వంలో మైఖేల్ జాక్సన్ బయోపిక్

రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. ఇప్పుడు హాలీవుడ్ పై కన్నేశాడు. గతంలో సందీప్ రెడ్డి దర్శకత్వం వహించిన బాలూవుడ్ సినిమాలు కబీర్ సింగ్, ఆనిమల్ చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ఈ క్రమంలో సందీప్ రెడ్డి తాజాగా ప్రపంచ ప్రఖ్యాత డ్యాన్సర్ మైఖేల్ జాక్సన్ బయోపిక్ తీసీ పనిలో పడ్డాడని తెలుస్తోంది. అంతే కాదు ఇందుకు సంబందించిన స్క్రిప్ట్ పై పని చేస్తున్నాడని సమాచారం. ఇందులో భాగంగా తనకి మైఖేల్ జాక్సన్ బయోపిక్ తెరకెక్కించాలని ఉందని తన మనసులో మాట చెప్పుకొచ్చాడు సందీప్ రెడ్డి. మైఖేల్ జాక్సన్ జీవితంలో అతడి చిన్నతనం, విద్య, డ్యాన్స్ కెరీర్.. మరీ ముఖ్యంగా అతడి శరీర రంగుని ఎలా మార్చుకోగలిగాడనే విషయాలు చాల ఆసక్తికరంగా ఉంటాయని చెప్పుకొచ్చాడు సందీప్ రెడ్డి వంగా.

ఐతే ఈ బయోపిక్ లో మైఖేల్ జాక్సన్ పాత్రలో ఎవరు నటిస్తారనేదే పెద్ద ప్రశ్న అని సందీప్ రెడ్డి అన్నారు. అంతే కాకుండా మైఖేల్ జాక్సన్ పాత్రలో నటించడమనేది పెద్ద ఛాలెంజ్ అని చెప్పుకొచ్చారు. ఇక మైఖేల్ జాక్సన్ బయోపిక్ ని హాలీవుడ్ మరియు బాలీవుడ్ లో తెరకెకెక్కించాల్సి ఉంటుందని మనసులో మాట చెప్పాడు సందీప్ రెడ్డి వంగా. ఒకవేళ మైఖేల్ జాక్సన్ బయోపిక్ ని తాను కాకుండా ఇంకెవరు తీసినా తప్పకుండా టికెట్ కొని ఆ సినిమా చూస్తానని అన్నాడు. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా తెలుగులో స్పిరిట్ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటిస్తున్నాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular