Friday, March 21, 2025

అరికెల పొలంలో ఏనుగుల మృతి

మధ్యప్రదేశ్‌లోని బంధవ్‌గఢ్ టైగర్ రిజర్వ్‌లో ఘటన
అరికెల పొలంలో మేతకు వెళ్లి మూడు రోజుల్లో పది ఏనుగుల మృతి
పంటకు పురుగులు పట్టకుండా వాడిన మైకోటాక్సిన్స్ వల్లేనని నిర్ధారణ

అరికెల పొలంలో మేతకు వెళ్ళి ఏనుగులు మృతి చెందాయి. మధ్యప్రదేశ్‌లోని ఉమరియా జిల్లాలో ఉన్న బంధవ్‌గఢ్‌ టైగర్‌ రిజర్వ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. చనిపోయిన ఏనుగులకు పోస్ట్‌మార్టం నిర్వహించగా మైకోటాక్సిన్స్‌ కారణంగా మృత్యువాత పడినట్టు అధికారులు నిర్ధారించారు. ఏనుగులు చనిపోవడంతో అటవీ అధికారులు ఆ పొలాన్ని ధ్వంసం చేశారు. మూడు రోజుల్లో పది ఏనుగుల మరణానికి అరికెల పంటకు వాడిన మందులే కారణమని నిర్ధారించిన అటవీశాఖ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. అరికెల పొలాలు, ఏనుగులు నీళ్లు తాగిన నీళ్ల నమూనాలు తీసుకుని పరీక్షలకు పంపారు.

పది ఏనుగుల్లో నాలుగు మంగళవారం మృతి చెందగా, మరో నాలుగు బుధవారం, రెండు గురువారం మరణించాయి. మూరో మూడు ఏనుగుల పరిస్థితి నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం అవి వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాయి. అరికెల పంటకు పురుగులు పట్టకుండా వాడిన రసాయనాల్లో మైకోటాక్సిన్స్ ఉండడం వల్ల ఆ పంటను తిన్న ఏనుగులు మృతి చెంది ఉంటాయని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.

పోస్టుమార్టం సందర్భంగా, ఏనుగుల పొట్టలో పెద్ద మొత్తంలో అరికెలను గుర్తించారు. వీటి మృతిపై దర్యాప్తు కోసం ఐదుగురు సభ్యులతో కూడిన బృందాన్ని అధికారులు నియమించారు. మధ్యప్రదేశ్‌లోని ఈ బంధవ్‌గడ్ టైగర్ రిజర్వ్‌లో పులులతో పాటు ఏనుగులు కూడా ఉన్నాయి.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com