Monday, March 10, 2025

గత పదేళ్లలో టన్నెల్‌ ఎం‌దుకు పూర్తి చేయలేదు

  • హరీష్‌ ‌రావు అసలు విషయాలు మాట్లాడాలి
  • మండిపడ్డ మంత్రి జూపల్లి కృష్ణారావు
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ను గత ప్రభుత్వం ఎందుకు పూర్తి చేయలేదని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రశ్నించారు. 2014 నుండి 2023 వరకు 200 కిలోమీటర్ల టన్నెల్‌ ‌పనులు చేశామని హరీష్‌ ‌రావు అంటున్నారు, పదేళ్లలో మిగిలిన 19 కి ఎందుకు తవ్వలేక పోయారన్నారు. అడిగిన దానికి తప్ప.. అన్నిటికి హరీష్‌ ‌రావు స్పందిస్తారని విమర్శించారు. ప్రమాదం జరగగానే హరీష్‌ ‌రావు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. గాంధీ భవన్‌లో మంత్రి జూపల్లి మీడియాతో మాట్లాడారు. ’ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌కి హరీష్‌ ‌రావు వంద వాహనాల్లో యుద్దానికి వెళ్లినట్టు వొచ్చారు. అడిగిన దానికి తప్ప.. అన్నింటికీ ఆయన స్పందిస్తారు. 2014 నుంచి 2023 వరకు 200 కిమీలోటర్ల టన్నెల్‌ ‌పనులు చేశామటున్నారు, పదేళ్లలో మిగిలిన 19 కి ఎందుకు తవ్వలేకపోయారు.
డబ్బులు లేక తవ్వలేదా ఎస్‌ఎల్‌బీసీ లేదా.. కాంగ్రెస్‌ ‌పార్టీకి పేరు వొస్తుందని తవ్వలేదా?. నేను ఒక్కడినే టన్నెల్‌ ‌లోపలికి వెళ్ళాను. టన్నెల్‌లోకి వాటర్‌, ‌బురద వొచ్చి ముసుకుపోయింది. అది తీస్తే మరలా వరద వొస్తది కదా. 8 మందిని తీయడానికి 100 మంది లోపలికి పోయారు. బురద, నీళ్లు వొస్తున్నప్పుడు మళ్ళీ ప్రమాదం జరిగితే.. ఇంకో ఘటన జరుగుతుంది కదా?. జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. జాతీయ సంస్థలు అన్నీ వొచ్చాయి, ఆ సంస్థలు చెప్పినట్టు చేస్తున్నాం’ అని మంత్రి జూపల్లి తెలిపారు.
’జిల్లా మంత్రిగా నేనే టన్నెల్‌లోకి వెళ్లి వచ్చా. మమ్మల్ని రానివ్వలేదు అని కొందరు డ్రామా చేశారు. రావడానికి అనుమతి ఇచ్చింది మేమే, రాజకీయ లబ్ది కోసం డ్రామా చేస్తున్నారు. రేమైనా అధికారంలో ఉన్నప్పుడు అనుమతి ఇచ్చారా?. వొచ్చి చూడాలి అనుకుంటే.. 100 వాహనాల్లో వొస్తారా?. పాలమూరు రంగారెడ్డిలో ప్రమాదం జరిగితే కేసీఆర్‌ ‌వచ్చాడా?.. పవర్‌ ‌హౌస్‌ ‌మునిగితే కేసీఆర్‌ ‌వొచ్చాడా?, మంత్రి వొచ్చాడా?.. కొండగట్టు ప్రమాదంలో 65 మంది చనిపోతే కేసీఆర్‌ ‌వెళ్ళాడా?.. కాళేశ్వరం టన్నెల్‌లో ఏడుగురు చనిపోయినపుడు కేసీఆర్‌, ‌హరీష్‌ ‌పోయాడని మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com