Friday, September 20, 2024

టీవీ చూడాలని పిలిచి..! చిన్నారిని కాటేసిన కుర్రాడు

ఏడేళ్ల చిన్నారిని కాటేసిన పక్కింటి కుర్రాడు

హైదరాబాద్ శివారు రామచంద్రాపురం పీఎస్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఏడేళ్ల చిన్నారిపై 17 ఏళ్ల మైనర్ బాలుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. టీవీ చూద్దామని పిలిచి చిన్నారిపై అత్యాచారం చేశాడు. చిన్నారికి తీవ్ర రక్తస్రావం కావటంతో ఆసుపత్రికి తీసుకెళ్లగా అసలు విషయం బయటపడింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. చిన్నారులు, మహిళలపై అత్యాచార పర్వాలు కొనసాగుతూనే ఉన్నాయి.

దేశవ్యాప్తంగా ఎక్కడో ఓ చోట ప్రతినిత్యం అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు కామాంధుల కామవాంఛకు బలైపోతున్నారు. చాక్లెట్ కొనిస్తానని ఒకడు.. బిస్కెట్ పేరుతో ఇంకొకడు.. టీవీ చూద్దామని మరొకడు.. ఇలా అభం శుభం తెలియని చిన్నారులను మభ్యపెట్టి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఎక్కడ చూసినా అత్యాచారాలతో దేశం అట్టుడికిపోతోంది. నిర్భయ లాంటి కఠిన చట్టాలు తీసుకొచ్చినా.. బాలికలు, మహిళల రక్షణ ప్రశ్నార్థకంగానే మిగిలిపోతుంది. తాజాగా.. హైదరాబాద్ శివారులో అమానుష ఘటన చోటు చేసకుంది.

టీవీ చూద్దామని పిలిచి ఏడేళ్ల బాలికపై 17 ఏళ్ల బాలుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. చిన్నారిని ఏమార్చి అత్యాచారం చేశాడు. ఒంటరిగా ఉన్న బాలికను మభ్యపెట్టి దారుణానికి ఒడిగట్టాడు. వివరాల్లోకి వెళితే.. రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని భారతీ నగర్‌ డివిజన్‌ ఇక్రిశాట్‌ ఫెన్సింగ్‌ ఏరియాలో ఓ కుటుంబం నివసిస్తోంది. తల్లిదండ్రులు రోజూవారీ కూలీ పనులకు వెళ్తుండగా.. వారి ఏడేళ్ల కూతురు స్థానిక పాఠశాలలో చదువుకుంటుంది. అయితే మంగళవారం (సెప్టెంబర్ 17) గణేష్ నిమజ్జనం ఉండటంతో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. దీంతో బాలిక ఇంటి వద్దే ఉంది. తల్లిదండ్రులు కూలీ పనుల కోసం బయటకు వెళ్లారు.

ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికను పక్కింట్లో ఉండే 17 ఏళ్ల కుర్రాడు గమనించాడు. మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేరని పక్కాగా నిర్ధారించుకొని చిన్నారి ఇంట్లోకి ప్రవేశించాడు. చిన్నారితో మాటమాట కలిపి టీవీ చూద్దామని చెప్పి ఏమార్చాడు. ఆపై తన ఇంట్లోకి తీసుకెళ్లి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం బాలికను ఇంటికి పంపించాడు. సాయంత్రం చిన్నారి తల్లిదండ్రులు ఇంటికొచ్చే సమయానికి బాలిక తీవ్ర రక్తస్రావంతో ఏడుస్తుంది.

ఆందోళనకు గురైన చిన్నారి తల్లిదండ్రులు వెంటనే స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన డాక్టర్లు చిన్నారిపై అత్యాచారం జరిగిందని నిర్ధారించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. బాలికతో మాట్లాడి వివరాలు తెలుసుకోగా.. పక్కింట్లో ఉండే కుర్రాడు దారుణానికి పాల్పడినట్లు చెప్పింది. చిన్నారి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో కేసు నమోదు చేసుకున్నారు. మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular