Friday, September 20, 2024

మైనర్ బాలికపై అత్యాచారం…..గంజాయి మత్తు లో మృగం గా ప్రవర్తన

మచిలీపట్నం శనివారం మైనర్ బాలికను అత్యంత పాసవికంగా బహిరంగ ప్రదేశం తుమ్మ చెట్ల లో అత్యాచారం చేసిన దుండగుడు. సేకరించిన వివరాలు ప్రకారం గోపాల్ నగర్ కు చెందిన పోలిశెట్టి పవన్ కుమార్ ఏ పని చేయకుండా ఖాళీగా ఉంటూ జూలైగా తిరుగుతూ .గంజాయి కి బానిస అయ్యాడు. గంజాయి మత్తులో అతను మృగంలా ప్రవర్తిస్తాడట. గుమస్తాల కాలనీ కు చెందిన ఓ మైనర్ బాలిక రుస్తుంబాద్ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. పేద కుటుంబంలో జన్మించిన మైనర్ బాలిక తాను పేదరికం జయించడానికి, ఉన్నతంగా స్థిరపడటానికి చదువు ఒకటే మార్గమని ప్రతిరోజు పాఠశాలకు వెళుతుంది.

మైనర్ బాలిక తండ్రి మరణించాడు తల్లి( పుట్టు గుడ్డి) దివ్యాంగురాలు వచ్చిన పెన్షన్ మీదే కుటుంబం జీవనం సాగిస్తోంది. మైనర్ బాలిక ఒకవైపు పని చేసుకుంటూనే చదువు కొనసాగిస్తోంది. మైనర్ బాలిక కుటుంబ నేపథ్యం పేదరికం కావటంతో ఇదే అదును చూసుకొని పోలిశెట్టి పవన్ కుమార్ మైనర్ బాలికకు తెలియకుండా ఫాలో అవుతూ కొంతకాలంగా ఒంటరిగా ఎప్పుడు కనిపిస్తుందోనని వేచి చూస్తున్నాడు.

నిన్న సాయంత్రం పాఠశాల నుంచి వస్తున్న మైనర్ బాలికను ఒంటరిగా ఉండటం గమనించిన
పవన్ కుమార్ గంజాయి మత్తులో మైనర్ బాలికను లాక్కుని వెళ్ళి హౌసింగ్ బోర్డ్ పొలిమేరలో తుమ్మ చెట్ల చాటున పాసవికంగా అత్యాచారం చేసి మృగంలా ప్రవర్తించాడు.ఏమి చేయలేని నిర్చల స్థితిలో ఉన్న మైనర్ బాలిక ఏడుస్తూ కుటుంబ సభ్యులను సంప్రదించి జరిగిన ఉదాంతన్నంత వివరించింది. తనకు జరిగిన అన్యాయం ఇంకెవరికి జరగకూడదని ధైర్యం చేసి చిలకపొడి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఫిర్యాదు స్వీకరించిన ఎస్సై సుబ్రమణ్యం బాధితురాలుని ఆసుపత్రికి తరలించారు. నిందితుడు పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిలకలపూడి. సి.ఐ. నబి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

Aamna Sharif latest stills

Surbhi Jyothi Glam Pics

Rashmika Mandanna New Pics

Ritu Sharma Latest Photos