Monday, April 21, 2025

బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాసంలో చోరీ

  • తలుపులు, స్టీల్ సామగ్రిని ఎత్తుకెళ్లిన దుండగులు
  • ఆర్ అండ్ బి అధికారుల ఫిర్యాదు మేరకు
  • కేసు నమోదు చేసిన పోలీసులు

బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాసంలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. మంత్రుల నివాస ప్రాంగణంలో జరిగిన ఈ దొంగతనం కలకలం రేపుతోంది. మంత్రుల నివాస ప్రాంగణంలో నిర్మాణంలో ఉన్న కట్టడాల్లో జరుగుతున్న చోటు నుంచి నిర్మాణ సామగ్రి చోరీకి గురైంది. కన్‌స్ట్రక్షన్ సైట్ నుంచి తలుపులు, స్టీల్ సామగ్రిని గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించారు.

ఈ క్రమంలోనే ఆర్ అండ్ బి అధికారి ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అత్యంత హై సెక్యూరిటీతో ఉండే మంత్రుల నివాసంలోనే ఈ దొంగతనం జరగడంతో పోలీసులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. తలుపులు, స్టీల్ వస్తువులు దొంగిలించిన వారి కోసం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com