Sunday, May 4, 2025

మియాజాకీ.. మాయాజాలం

మూడు లక్షలకు కిలో మామిడి

జపాన్ మామిడి పండు ఇండియాలో అది కూడా తెలంగాణలో పండితే దాని ఖరీదు కేవలం మూడు లక్షలు మాత్రమే పలుకుతుంది. ఖమ్మం రైతు చేసిన అద్భుత సృష్టి మియాజాకీ మామిడి పండు. దీని ధర ఇప్పుడు అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది. జపాన్ మియాజాకీ మామిడి పండ్లు..ప్రపంచంలో అత్యంత ఖరీదైన పళ్ళు ఇవి. ఇవి ఇప్పటి వరకు అన్ని చోట్లా పండిన దాకలాలు లేవు. జపాన్ తర్వాత కాలిఫోర్నియాలో మరికొన్ని చోట్ల మాత్రమే పండేది. కానీ ఖమ్మానికి చెందిన ఓ రైతు చొరవ వల్ల ఈ మియాజాకీ మామిడి తెలంగాణకు వచ్చింది. కరోనా టైమ్ లో మియాజాకీ మామిడి పండు గురించి తెలుసుకున్న ఖమ్మం రైతు దానిని కాలిఫోర్నియా నుంచి తెప్పించి ఇక్కడ వేశారు. మూడేళ్లు పాటూ దాన్ని అత్యంత శ్రద్ధగా పండించుకుని వచ్చారు. ఒక్కో మొక్కను అక్షరాలా 12 వేల రూపాయలు వెచ్చించి మరీ 30 మొక్కలను దిగుమతి చేసుకున్నాడు. 2020లో నాటిన ఈ మొక్కలు ఇప్పుడు బంగారు పంటను పండిస్తున్నాయి.
అతని కష్టం ఫలించింది. లాస్ట్ ఇయర్ నుంచి మామిడి చెట్లు కాపు మొదలెట్టాయి. 2024లో ఒక్కో చెట్టుకు 30 పళ్ళు వస్తే..ఈ ఏడాది 80 దాకా కాశాయి. అవి ఒక్కోటి దాదాపు 500 గ్రాములు ఉన్నాయి. ఇతర మామిడి జాతి కంటే ఇవి నెల ముందుగానే పూత, కాత కూడా వస్తాయి. ప్రతి సంవత్సరం నవంబర్ నుండి డిసెంబర్ మధ్యలో ఈ తోట పూతకు వస్తుందని తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ పండ్ల ధర కిలో 2.50 లక్షల నుండి 3 లక్షల రూపాయల వరకు పలుకుతాయన్నారు. ప్రస్తుతం ఆయన తన ఇంట్లో వాళ్ళు తినగా మిగిలిన మామిడి పళ్ళను బయట అమ్ముతున్నారు. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు (సి, ఇ, ఎ, కె).. ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఈ మియాజాకీ మామిడి రకం మొట్టమొదటగా 1984లో జపాన్‌లోని మియాజాకి ప్రాంతంలో పండించబడింది. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com