Tuesday, March 18, 2025

ఎమ్మెల్యే వర్సెస్ కార్పోరేటర్స్

  • ఎల్బీనగర్లో నియోజకవర్గంలో తరచూ ప్రోటోకాల్ వివాదం
  • తాజాగా మన్సూరా బాద్ లో అభివృద్ధి కార్యక్రమాలకు బీజేపీ కార్పొరేటర్ల శంకుస్థాపన అడ్డుకున్న బీఆర్ఎస్ నాయకులు
  • అరెస్టు చేసిన హయత్ నగర్ పోలీసులు.. విడిపించిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

ఎల్బీనగర్ నియోజకవర్గంలో ప్రోటోకాల్ వివాదం మళ్ళీ రగులుకున్నది. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, బీజేపీ కార్పొరేటర్లు మధ్యన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాల్లో తరచూ ఈ వివాదం రాజుకుంటున్నది. తాజాగా మన్సూరా బాద్ డివిజన్ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం విషయంలో మరోమారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి బీజేపీ కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి మధ్య ప్రోటోకాల్ వివాదం నెలకొంది.

కాగా, తాము అధికారుల చుట్టూ తిరిగి నిధులు మంజూరు చేయించి, అభివృద్ధి పనులను పూర్తి చేశాక .. చివరిలో మాకు సమాచారం ఇవ్వకుండా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అభివృద్ధి పనులను ఎలా ప్రారంభిస్తారని బీజేపీ కార్పొరేటర్లు ఆక్షేపించారు. ఈ నెల 12న మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని పలు కాలనీల్లో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. దీనికి ముందు రోజు జీహెచ్ఎంసీ అధికారులు బీజేపీ కార్పొరేటర్లకు సమాచారం ఇచ్చారని, అయితే ఆయా కార్యక్రమాల్లో స్థానిక కార్పొరేటర్ కొప్పుల నర్సింహరెడ్డి పాల్గొనలేదు.

ఎమ్మెల్యే వైఖరిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఈ నెల 12న చేసిన శంకుస్థాపన కార్యక్రమానికి పోటీగా సోమవారం మరలా శంకుస్థాపన చేయడానికి మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి మరలా డివిజన్ లోని వీరన్న గుట్టలో పర్యటించారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కార్పొరేటర్ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక బీఆర్ఎస్ నాయకులు జగదీష్ యాదవ్, టంగుటూరి నాగరాజు, జక్కిడి రఘువీర్ రెడ్డి ఇతర నాయకులతో కలిసి నిరసన తెలిపారు.

ఈ క్రమంలో బీజేపీ, బీఆర్ఎస్ నాయకుల మధ్య తోపులాట జరిగింది. దీంతో బిఆర్ ఎస్ నాయకులపై కార్పోరేటర్ నర్సింహారెడ్డి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హయత్ నగర్ పోలీసులు వారిని అరెస్టు చేసి అబ్దుల్లాపూర్ మెట్ పోలీసు స్టేషన్ కు తరలించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు కొప్పుల విఠల్ రెడ్డి, జిట్టా రాజశేఖర్ రెడ్డి, సామ తిరుమల రెడ్డి, సాగర్ రెడ్డి, పద్మా నాయక్, భవానీ ప్రవీణ్ ఇతర నాయకులు అబ్దుల్లాపూర్ మెట్ పోలీసు స్టేషన్ వెళ్లి బీఆర్ఎస్ నాయకులను పరామర్శించారు.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com