మరో రెండు వారాలు కస్టడీ పొడిగింపు
సీబీఐ ప్రత్యేక కోర్టులో బీఆర్ఎస్ ఎంఎల్సి కవితకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఆమె జ్యూడిషియల్ కస్టడీ పొడిగించారు. కవిత జ్యుడిషియల్ కస్టడీ ముగియడంతో ఆమెను వర్చువల్గా కోర్టు ముందు అధికారులు హాజరుపరిచారు. ఈ సందర్భంగా ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత పాత్రపై సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేసింది.
ఛార్జిషీట్ పరిగణనలోకి తీసుకునే విషయంపై జులై 3న కోర్టు విచారణ జరపనుంది. ఈడీ నమోదు చేసిన కేసులో జులై 3 వరకు రౌస్ అవెన్యూ కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. దీనిపై కవిత వేసిన బెయిల్ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం కవితను వర్చువల్గా కోర్టులో అధికారులు హాజరుపరుచగా.. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు జులై 5 వరకు జ్యుడిషియల్ రిమాండ్ను పొడిగిస్తూ తీర్పును వెలువరించింది.