Saturday, June 29, 2024

జంట నగరాల్లో ఎంఎంటీఎస్​, డెమూ సర్వీసులు రద్దు

హైదరాబాద్‌, సికింద్రాబాద్ జంట నగరాల నుంచి ఎంఎంటీఎస్ ట్రైన్ ప్రయాణాలు సాగించేవారికి సౌత్ సెంట్రల్ రైల్వే కీలక ఆదేశాలు జారీ చేసింది. మే 25, 26వ తేదీల్లో పలు ఎంఎంటీఎస్‌ ట్రైన్లు, నాలుగు డెమూ సర్వీసులు రద్దు చేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. ప్రస్తుతం సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ ఆధునికీకరణ పనులు జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ పనులతో పాటు ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిల నిర్మాణం నేపథ్యంలో పలు మార్గాల్లో 22 ఎంఎంటీఎస్‌ సర్వీసుల్ని రద్దు చేస్తున్నట్లు చీఫ్‌ పీఆర్వో సీహెచ్‌ రాకేశ్‌ వెల్లడించారు. ఈ ట్రైన్లతో పాటు సిద్దిపేట-సికింద్రాబాద్‌ మధ్య సేవలందించే నాలుగు డెమూ ట్రైన్లు సైతం రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

మే 25, 26వ తేదీల్లో మేడ్చల్‌-లింగంపల్లి, లింగంపల్లి-మేడ్చల్‌, మేడ్చల్‌-సికింద్రాబాద్‌, సికింద్రాబాద్-మేడ్చల్‌, మేడ్చల్‌-సికింద్రాబాద్‌ ట్రైన్లను రద్దు చేశారు. ఫలక్‌నుమా-సికింద్రాబాద్‌, సికింద్రాబాద్‌-మేడ్చల్‌, సికింద్రాబాద్‌-ఫలక్‌నుమా, మేడ్చల్‌-సికింద్రాబాద్, లింగంపల్లి-మేడ్చల్‌, సికింద్రాబాద్‌ మేడ్చల్‌, మేడ్చల్‌-హైదరాబాద్‌, హైదరాబాద్‌-మేడ్చల్‌, మేడ్చల్‌-లింగంపల్లి మధ్య ప్రయాణించే ట్రైన్లు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక సిద్ధిపేట-సికింద్రాబాద్‌ మధ్య ప్రయాణించే ట్రైన్‌ను మే 25, మే 26 తేదీల్లో రద్దు చేశారు. ఈ తేదీలకు అనుగుణంగా ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని అధికారులు తెలిపారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ లో అడుగు పెట్టె సాహసం చేస్తాడా?
- Advertisment -

Most Popular