- దేశ ప్రజలకు ప్రధాని బహిరంగ క్షమాపణలు చెప్పాలి
- టిపిసిసి సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్
దేశ చరిత్రలో ఇంతగా దిగజారిన ప్రధానిని చూడలేదని, మొదటి దశ జరిగిన ఎన్నికల్లో వచ్చే ఫలితాల్లో బిజెపికి అనుకూలంగా రావడం లేదని కాంగ్రెస్ గురించి ప్రధాని మోడీ చెడుగా మాట్లాడుతున్నారని టిపిసిసి సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ ఆరోపించారు. గాంధీ భవన్లో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ మేనిఫెస్టో గురించి ప్రజలను తప్పు దోవ పట్టించాలని మోడీ ప్రయత్నిస్తున్నారు.
రాజ్యాంగ పీఠికలో అన్ని వర్గాలకు, మతాలకు సమాన అవకాశాలు ఉంటాయని ఆయన అన్నారు. దేశ ప్రజానికినికి క్షమాపణలు చెప్పిన తర్వాతే ప్రధాని మోడీ వారణాసిలో నామినేషన్ వేయాలని, ప్రధాని బహిరంగ క్షమాపణలు ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా మోడీ అనర్హుడని, ఈ విషయమై ఎన్నికల కమిషన్కు లేఖ రాస్తానన్నారు. ఎన్నికల మోడల్ కోడ్ ను రెండు సార్లు మోడీ ఉల్లంఘించారని ఆయన ఆరోపించారు.