రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి
త్యాగ నిరతికి, అనిర్వచనీయ సహనానికి మొహరం ప్రతీకగా నిలుస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి పేర్కొన్నారు. ముహమ్మద్ ప్రవక్త మనవడు హజ్రత్ ఇమామ్ హుస్సేన్ బలిదానాన్ని సంస్మరణగా మొహరం జరుపుకుంటారు అని ఆయన తెలిపారు.
తరతరాలుగా తెలంగాణ గ్రామాల్లో హిందూ, ముస్లింలు కలిసి పీర్ల ఊరేగింపు నిర్వహిస్తారని ఆయన గుర్తు చేసుకున్నారు. రాష్ట్రంలో గంగా, జమున, తెహజీబ్కు గొప్ప నిదర్శనం పీర్ల ఊరేగింపు అని ఆయన పేర్కొన్నారు. కులమతాలకు అతీతంగా ప్రజల మధ్య సఖ్యతకు, ఐక్యతకు వారధిగా మొహరం నిలుస్తుందని ఆయన అన్నారు.