Sunday, September 29, 2024

మంత్రి లోకేష్ ను క‌లిసిన ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) మంగ‌ళ‌గిరి క్రికెట్ స్టేడియం అభివృద్ది కోసం విన‌తి ప‌త్రం

విజ‌య‌వాడ : అమరావతి రాజధాని ప్రాంతం లోని ఎ.సి. ఏ ఇంటర్నేషనల్ క్రికెట్  స్టేడియంలో జాతీయ, అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లు నిర్వహించే విధంగా స్టేడియం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం అందించాలని కోరుతూ ఎసిఏ అధ్య‌క్షుడు, విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్  విద్యాశాఖ‌ మంత్రి లోకేష్ ను కోరారు.  మంగ‌ళవారం ఉండ‌వ‌ల్లిలోని ఆయ‌న నివాసంలో క‌లిసి విన‌తి ప‌త్రం అంద‌జేశారు. వెస్ట్రన్ బైపాస్ నుంచి స్టేడియం కి వచ్చేందుకు అనుబంధ రోడ్లు, నిడమర్రు రైల్వే లైన్ దగ్గర ఆర్.వో.బి నిర్మాణం, పార్కింగ్ కి స్థలం ఏర్పాటు, డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటుతో పాటు ఇత‌ర సదుపాయాలు క‌ల్పించాల‌ని ఎసిఏ అధ్య‌క్షుడు,  ఎంపి కేశినేని శివ‌నాథ్ వినతి పత్రం లో మంత్రి నారా లోకేష్ ను కోర‌టం జ‌రిగింది. మంత్రి నారా లోకేష్ ఎంపి కేశినేని శివ‌నాథ్ అభ్య‌ర్థ‌న‌ల‌పై సానుకూలంగా స్పందించారు

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular