రశ్మిక మందన్న పాన్ ఇండియా స్థాయిలో సాధిస్తున్న విజయాలు సర్ ప్రైజ్ చేస్తున్నాయి. ఈ విజయాలతో బాలీవుడ్ హీరోయిన్స్ ను మించిన క్రేజ్ సొంతం చేసుకుంటోంది రశ్మిక. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ అందుకుంటూ హీరోయిన్ గా నెంబర్ వన్ పొజిషన్ కు వెళ్లింది. ఆమె రీసెంట్ గా మూడు బిగ్గెస్ట్ హిట్స్ దక్కించుకుంది. రణ్ బీర్ కపూర్ సరసన నటించిన యానిమల్, అల్లు అర్జున్ కు జోడీగా చేసిన పుష్ప 2, వికీ కౌశల్ తో కలిసి నటించిన ఛావా ఘన విజయాలు సాధించాయి. ఈ మూడు చిత్రాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకుంది రశ్మిక మందన్న. ముగ్గురు స్టార్ హీరోలతో మూడు బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన రశ్మికకు సోషల్ మీడియాలో అప్రిషియేషన్స్ దక్కుతున్నాయి. ఈ సక్సెస్ లు కొనసాగిస్తూ ప్రస్తుతం తన క్రేజీ లైనప్ కంటిన్యూ చేస్తోంది రశ్మిక. సల్మాన్ ఖాన్ సరసన సికిందర్, నాగార్జున, ధనుష్ హీరోలుగా దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న కుబేర సినిమాలతో తో పాటు ది గర్ల్ ఫ్రెండ్ మూవీలో నటిస్తోంది.