సీఎం రేవంత్ రెడ్డిని.. సినీ నటుడు నాగార్జున కుటుంబంతో సహా కలిశారు. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రిని కలిసి తమ కుమారుడు అఖిల్ వివాహ వేడుకకు రావాలంటూ ఆహ్వానాన్ని అందించారు. ఈ సందర్భంగా సీఎంతో సినీనటుడు నాగార్జున దంపతులు భేటీ అయ్యారు. హైడ్రా ఏర్పాటు తర్వాత నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ను నేలమట్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సినీ ఇండస్ట్రీకి, ప్రభుత్వానికి మధ్య దూరం పెరిగిందనే విమర్శలు వచ్చాయి. అయితే, ఇటీవల సినిమా ఇండస్ట్రీ సమస్యలపై సీఎంతో సినీ నటులు, నిర్మాతలు, పలువురు సమావేశమైనప్పుడు నాగార్జున కూడా కలిశారు. ఆ తర్వాత ఇప్పుడు అఖిల్ వివాహానికి రావాలంటూ తన భార్య అమలతో కలిసి సీఎంను ఆహ్వానించారు.