Friday, April 11, 2025

రైతుల ముసుగులో బిఆర్‌ఎస్ నేతలు కలెక్టర్‌పై దాడి చేశారు

నాగర్ కర్నూలు ఎంపి మల్లు రవి ఆగ్రహం
ఢిల్లీలో కెటిఆర్ డ్రామాలు ఆడుతున్నారని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కెటిఆర్‌పై కాంగ్రెస్ నేత, నాగర్ కర్నూలు ఎంపి మల్లు రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలు పదేళ్లు అధికారం ఇస్తే గిరిజనుల కోసం ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. లగచర్లలో ప్రజలు, రైతులను రెచ్చగొట్టి అధికారుల మీదకు ఉసిగొల్పింది మీరు కాదా? అని మల్లురవి మండిపడ్డారు.

గొడవలకు కారణం కెటిఆర్ అని తేలడంతో కొత్త డ్రామాలకు తెరలేపారని సీరియస్ అయ్యారు. రైతుల ముసుగులో బిఆర్‌ఎస్ నేతలు కలెక్టర్‌పై దాడి చేశారని ఆయన ఆరోపించారు. ప్రజా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు పథకం ప్రకారం ఆ పార్టీ కుట్రలు చేస్తోందని ఆయన అన్నారు. ఇది సిఎం రేవంత్ రెడ్డిపై జరిగిన దాడి కాదని, ప్రజాస్వామ్య పాలనపై జరిగిన దాడిగా ఆయన అభివర్ణించారు. ప్రభుత్వంపై వ్యతిరేకత రాకపోవడంతో ప్రజలను బిఆర్‌ఎస్ రెచ్చగొడుతోందని ఆయన మండిపడ్డారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com