నారాయణ కాలేజీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తూ ఇంటర్ విద్యార్ధి మృతి చెందాడు. తనకు ఇష్టం లేకపోయినప్పటికీ గిరీష్ కుమార్ అనే స్టూడెంట్ ను అతని తల్లిదండ్రులు హాస్టల్ లో వేశారు. అయితే శుక్రవారం అర్ధరాత్రి కాలేజీ గోడ దూకేందుకు గిరీష్ కుమార్ ప్రయత్నిస్తున్న క్రమంలో విద్యుత్ తీగ తగలడంతో అక్కడిక్కడే ప్రాణాలు విడిచాడు.
దీంతో గిరీష్ కుమార్ విగతజీవిగా పడి ఉండటాన్ని చూసిన తోటి విద్యార్థులు కాలేజీ యాజమాన్యానికి సమాచారం అందజేశారు. అనంతరం హయత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.