Sunday, October 6, 2024

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన నేషనల్ సైక్లిస్ట్ ఆశా మాల్వియా

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసిన నేషనల్ సైక్లిస్ట్ ఆశా మాల్వియా
అభినందించిన సిఎం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నేషనల్ సైక్లిస్ట్ ఆశా మాల్వియా కలిశారు. మధ్యప్రదేశ్‌కు చెందన జాతీయ క్రీడాకారిణి ఆశా మాల్వియా ఆదివారం సిఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తాజాగా ఆశా కార్గిల్ దివస్ సిల్వర్ జూబ్లీ సందర్భంగా కన్యాకుమారి నుంచి కార్గిల్ వరకు ఆశా మాల్వియా సైకిల్ యాత్ర నిర్వహిస్తున్నారు. జూన్ 24వ తేదీన కన్యాకుమారి నుంచి సైకిల్ యాత్ర ఆశా మాల్వియా మొదలుపెట్టింది. ఈ సందర్భంగా ఆశాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందిస్తూ ఆసక్తికర ట్వీట్ చేశారు.

‘మన వీర సైనికుల జ్ఞాపకార్థం కార్గిల్ దివాస్ రజతోత్సవ సంవత్సరాన్ని పురస్కరించుకొని కన్యాకుమారి నుంచి కార్గిల్ వరకు సైకిల్ ప్రయాణం ప్రారంభించిన మన దేశానికి చెందిన ధైర్యవంతులైన అథ్లెట్ ఆశా మాల్వీయను కలుసుకున్నానని ట్విట్టర్‌లో సిఎం ఫొటో షేర్ చేశారు. కాగా, ఇటీవల ఆశా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యను కలిశారు.

మహిళ భద్రత, సాధికారత ప్రాముఖ్యత పై అవగాహన కల్పించేందుకు 28 రాష్ట్రాల్లో 25 వేల కిలోమీటర్ల మేర ఆశా ఒంటరిగా ప్రయాణించడాన్ని కర్ణాటక సిఎం అభినందించారు. సోలో సైకిల్ యాత్ర చేస్తూ సైక్లిస్ట్‌గా ఆశా ఎన్నో రికార్డులు సృష్టించారు

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular