మనసుకు నచ్చిన కథానాయిక కియారా అద్వానీని చూసి హీరో రామ్ చరణ్ పాట పాడితే వినటానికి మనసుకి ఉత్సాహంగా ఉంటుంది. మరి దాన్ని సిల్వర్ స్క్రీన్పై శంకర్ లాంటి స్టార్ డైరెక్టర్ తెరకెక్కిస్తే చూడటానికి రెండు కళ్లు చాలవనేంత గొప్పగా ఉంటుందనటంలో సందేహం లేదు. రామ్ చరణ్, కియారా ఆటా పాట, తమన్ సంగీతం, శంకర్ మేకింగ్ స్టైల్లో వావ్ అనేలా తెరకెక్కిన ఈ పాటను చూడాలంటే ‘గేమ్ ఛేంజర్’ సినిమా వచ్చే వరకు ఆగాల్సిందేనంటున్నారు నిర్మాతలు దిల్ రాజు, శిరీష్.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ చిత్రం ‘గేమ్ ఛేంజర్’. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై జీ స్టూడియోస్ అసోసియేషన్లో ఈ సినిమాను దిల్ రాజు, శిరీష్ భారీ బడ్జెట్తో అన్ కాంప్రమైజ్డ్గా నిర్మిస్తున్నారు. మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘గేమ్ ఛేంజర్’ సినిమా నుంచి ‘జరగండి’ అనే లిరికల్ సాంగ్ను రిలీజ్ చేశారు. 150 పైన థియేటర్స్లో ఈ పాటను ప్రత్యేకంగా ప్రదర్శించటం విశేషం. మ్యూజిక్ సెన్సేషనల్ ఎస్.ఎస్.తమన్ సంగీత సారథ్యంలోని ఈ పాటను అనంత శ్రీరామ్ రాయగా దలేర్ మెహందీ, సునిధీ చౌహాన్ పాడారు.
‘జరగండి’ పాట విషయానికి వస్తే.. రామ్ చరణ్, కియార అద్వానీ జంట స్క్రీన్పై చూడ ముచ్చటగా ఉంది. ఇక డైరెక్టర్ శంకర్ మేకింగ్లో తనదైన భారీతనాన్ని చూపించబోతున్నారని పాటలోని కొన్ని సన్నివేశాలను చూస్తుంటేనే అర్థమవుతుంది. పాటే ఈ రేంజ్లో ఉంటే శంకర్.. ‘గేమ్ ఛేంజర్’ సినిమాను ఏ రేంజ్లో తెరకెక్కిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.