Sunday, March 9, 2025

జర్నలిస్టుల సంక్షేమానికి త్వరలో కొత్త పాలసీ

  • మహిళా జర్నలిస్టులు యజమానులుగా ఎదగాలి
  • మహిళ పట్ల గౌరవం పెరగాలి
  • మహిళా దినోత్సవ వేడుకల్లో మంత్రి సీతక్క

తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమం కోసం కొత్త పాలసీని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తామని మహిళా శిశు సంక్షేమ శాఖ, పంచాయతీ రాజ్‌, ‌గ్రామీ ణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి సీతక్క వెల్లడిం చారు. జర్నలిస్టుల సంక్షేమం, వైద్యం, అభివృద్ధి, వేతనాలపై ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డితో చర్చించి ఒక కొత్త పాలసీ తీసుకురావడానికి కృషి చేస్తానని ఆమె చెప్పారు. ‘‘ది జర్నలిస్టు కో ఆపరేటివ్‌ ‌హౌసింగ్‌ ‌సొసైటీ లిమిటెడ్‌’’ ఆధ్వర్యంలో జూబ్లీ హిల్స్ ‌లోని సొసైటీ కార్యాలయంలో గురువారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహి ంచారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క హాజరయ్యారు. సొసైటీలోని సీనియర్‌ ‌మహిళా జర్నలిస్టులను ఆమె సన్మాని ంచారు. సొసైటీ చరిత్రను, జర్నలిస్టుల కోసం సొసైటీ చేస్తున్నకృషిని అధ్యక్ష్యుడు బ్రహ్మాండ భేరి గోపరాజు మంత్రికి వివరించారు.

ఈ సం దర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. అంతరా్జ తీయ మహిళా దినోత్సవం అంటే ఒక ఉద్యమ ఉత్సాహమని, ఈ రోజుల్లో రకరకాల థీమ్స్ ‌తో మహిళా దినోత్సవం జరుపుకుంటున్నారని అన్నారు. జర్నలిజం  వృత్తిలో ఉన్న మహిళలు యజమానులుగా ఎదగాలని ఆకాంక్షించారు. వార్తల సేకరణలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నారని గుర్తు చేశారు. కుంభకోణాలను బయటికి తీయడానికి కూడా వెనుకాడని ధైర్యవంతులు ఉన్న మీడియా రంగంలో పనిచేస్తున్న మహిళలకు సైతం లైంగిక వేధింపులు, వేతనాల్లో అసమానతలు, వివక్ష తప్పడం లేదని  మంత్రి సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజా సమస్యలను ప్రపంచానికి తెలియజేయడంలో మీడియా పాత్ర కీలకమని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టులు ఎంతో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. వివిధ రంగాల్లో సక్సెస్‌ ‌సాధించిన మహిళల కథనాలను విస్తతంగా ప్రచురించి ప్రచారం చేస్తే ఇంకా మంచిదని, మీ కలం ద్వారా మహిళలను మరింత ప్రొత్సహించాలని మంత్రి కోరారు. సమాజంలో ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉంటూ సమస్యల పరిష్కారానికి ఉపయోగపడే కథనాలు రావాలని ఆమె ఆకాంక్షించారు. ఇప్పటి వరకు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చింది కాంగ్రెస్‌ ‌ప్రభుత్వమేనని గుర్తుచేశారు. ఆడవారి పట్ల గౌరవం అనేది ఇంటి నుంచి ప్రారంభం కావాలనీ, ఇంట్లో పిల్లలకు నేర్పాలి..

పాఠశాల్లలో గురువులు నేర్పాలి.. పాఠ్యాంశాల్లో చేర్పించాలనేది తన అభిమతమన్నారు. అలాగే మహిళ అగౌరవపరిస్తే ఏ రకమైన శిక్షలు ఉంటాయనేది కూడా అందరికీ తెలియజేయాలని సూచించారు. ఈ సందర్భంగా పలువురు మహిళా జర్నలిస్టులను సీతక్క సన్మానించారు. అనంతరం సొసైటీ సభ్యులు, మహిళా జర్నలిస్టులు కలిసి సీతక్కను ఘనంగా సత్కరించారు. గతంలో మూడు కాలనీలకు కలిపి 36 మంది మహిళా జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలను సొసైటీ కేటాయించిందని, ఇంకా వందకు పైగా మహిళా జర్నలిస్టులు వెయింటింగ్‌ ‌లిస్ట్ ఉన్నారని సొసైటీ అధ్యక్షుడు బ్రహ్మాండభేరి గోపరాజు మంత్రి సీతక్కకు గుర్తు చేశారు. వారికి కూడా పట్టాలు ఇప్పించే బాధ్యత సీతక్క తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో  ప్రెస్‌ అకాడమీ మాజీ ఛైర్మన్‌ ‌దేవులపల్లి అమర్‌, ‌ది జర్నలిస్టు కోఆపరేటివ్‌ ‌హౌసింగ్‌ ‌సొసైటీ అధ్యక్షుడు బ్రహ్మండభేరి గోపరాజు, కార్యదర్శి రవీంద్ర బాబు, ఉపాధ్యక్షుడు లక్ష్మి నారాయణ మసాదె, సంయుక్త కార్యదర్శి డాక్టర్‌ ‌చల్లా భాగ్యలక్ష్మి, కోశాధికారి భీమగాని మహేశ్వర్‌ ‌గౌడ్‌, ఎం‌సి మెంబర్‌ ‌కమలాకరాచార్య, సీనియర్‌ ‌జర్నలిస్టులు పాల్గొన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com