Monday, June 2, 2025

డిగ్రీలో కొత్త సిలబస్‌ ఈ విద్యా సంవత్సరం నుంచే అమల్లోకి

రాష్ట్రంలో ఏటా ఇంజినీరింగ్‌లో దాదాపు లక్ష మంది ప్రవేశాలు పొందుతుండగా బీఏ, బీకాం, బీఎస్‌సీ, బీబీఎం, బీబీఏ, బీసీఏల్లో 2 లక్షల మంది చదువుతున్నారు. ప్రస్తుతం యూనివర్సిటీ, రెసిడెన్షియల్, ప్రైవేట్, ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు 1,100 వరకు ఉన్నాయి. వాటిలో 80 ప్రభుత్వ, మరో 20 ప్రైవేటు డిగ్రీ కళాశాలలు యూజీసీ స్వయం ప్రతిపత్తి హోదా కలిగి ఉన్నాయి. ఆ కళాశాలలకు 20-30 శాతం సిలబస్‌ మార్చుకునే అవకాశం ఉండడంతో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు చేస్తున్నారు. మిగిలిన చోట్ల ఉన్నత విద్యామండలి నిర్ణయించిందే సిలబస్‌గా ఉంది. ఇప్పటివరకు సప్లిమెంటరీ సబ్జెక్టులుగా ఉన్న స్కిల్‌ డెవలప్‌మెంట్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ వాటిని ప్రధాన సిలబస్‌లోకి తీసుకురావాలని ప్రభుత్వం భావించింది.
ప్రస్తుతం నైపుణ్యం ఉన్న విద్యార్థులకే ఉద్యోగావకాశాలు దక్కుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడున్న పాఠ్య ప్రణాళికను సమీక్షించి నేటి అవసరాలకు తగ్గట్లు మార్చాలని విద్యామండలి నిర్ణయించింది. ముఖ్యంగా డిగ్రీ పూర్తయిన తర్వాత ఉద్యోగావకాశాలు దక్కేలా నైపుణ్యాలను పెంచడం, కంప్యూటర్‌ పరిజ్ఞానాన్ని అనుసంధానం చేయడం, ఇంటర్న్‌షిప్‌లు, ప్రాజెక్టులకు పెద్దపీట వేయడం వంటి చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. వీలైనంత వరకు సాంకేతికతను మిళితం చేయాలని యోచిస్తున్నారు. ఇప్పటివరకు సప్లిమెంటరీ సబ్జెక్టులుగా ఉన్న స్కిల్‌ డెవలప్‌మెంట్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ వాటిని ప్రధాన సిలబస్‌లోకి తీసుకురావాలని కామర్స్‌ సహాయ ఆచార్యుడు ఒకరు అభిప్రాయపడ్డారు. తరగతి గది బోధనకు ప్రాధాన్యం తగ్గించి ప్రాక్టికల్స్‌కు పెద్దపీట వేయాలని ఆయన సూచించారు. ఉన్నత విద్యామండలి మాత్రం త్వరలో సబ్జెక్టులు వారీగా నిపుణుల కమిటీలను నియమించి సమీక్షించాలని నిర్ణయించినట్లు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం(2025-26) కొత్త సిలబస్‌ అమల్లోకి రానుంది. విద్యామండలి నిర్ణయించిన సిలబస్‌తో తెలుగు అకాడమీ పాఠ్య పుస్తకాలను ముద్రిస్తుంది.

చివరిగా 2019లో మార్పు
రాష్ట్రంలో చివరిసారిగా 2019లో పాఠ్యప్రణాళికను మార్చారు. అంటే ఆరు విద్యా సంవత్సరాలు పూర్తయ్యాయి. అప్పట్లో ప్రధానంగా డిగ్రీ చివరి సంవత్సరంలోనూ ఇంగ్లీష్ సబ్జెక్టు ఉండేలా నిర్ణయం తీసుకున్నారు. డిగ్రీ పూర్తయిన తర్వాత ఉద్యోగ సమయంలో ఇంగ్లీస్ రాకుంటే మరింత నష్టపోతారన్న అభిప్రాయడంతో ఆ మార్పు చేశారు. మిగిలినందా మొక్కుబడిగానే చేశారన్న విమర్శలున్నాయి. అప్పట్లో ఉన్నత విద్యామండలిలో ఓ ఉన్నతాధికారి సదస్సులు, సమావేశాలంటూ హంగామా చేశారు తప్ప అతి ముఖ్యమైన సిలబస్‌ మార్పును పట్టించుకోలేదు. వాస్తవానికి ప్రతి మూడేళ్లకు ఒకసారి ఆ ప్రక్రియ చేయాల్సి ఉన్నా ఉన్నత విద్యామండలి మాత్రం ఉదాసీనంగా వ్యవహరించినట్లు భావిస్తున్నారు. గత మూడేళ్లలో బీకాం డేటా సైన్స్, బీఎస్సీ ఏఐ అండ్‌ ఎంఎల్‌ లాంటి విభిన్న కోర్సులను ప్రవేశపెట్టినా పాఠ్య ప్రణాళిక మార్పుపై మాత్రం దృష్టి పెట్టలేదు.

ప్ర‌దాన వార్త‌లు

సొంత పార్టీ వాళ్లే ఎంపీగా ఓడించారన్న కవిత వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com