వికసిత భారత్ లక్ష్యంగా అడుగులేస్తున్న కేంద్ర ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్ను లోక్సభలో ప్రవేశపెట్టనుంది. పేదరిక నిర్మూలన, ఆహార, సామాజిక భద్రత, ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యం ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
ఆదాయపన్ను రేట్లు, స్లాబ్లో మార్పులు చేస్తారనే సంకేతాలు ఉన్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెన్ను ప్రవేశపెట్టనున్నారు. వరసగా 8 సార్లు కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఘనతను సాధించనున్నారు.