రైళ్ల సమయంలో ఎలాంటి మార్పులు చేయలేదు…
మెట్రో అధికారుల ప్రకటన
మెట్రో ప్రయాణికులకు యాజమాన్యం కీలక సూచనలు చేసింది. మెట్రో రైలు ప్రయాణ వేళల్లో ఎలాంటి మార్పులు లేవని ఆదివారం మెట్రో అధికారులు స్పష్టం చేశారు. ఎప్పటిలాగే ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల మధ్య మెట్రో రైళ్లు నడుస్తాయని తెలిపారు. ఐపిఎల్ మ్యాచ్ దృష్ట్యా రైళ్ల సమయంలో మార్పులు ఉంటాయని జరుగుతున్న ప్రచారంపై కూడా అధికారులు స్పందించారు.
ఈ సమయంలోనూ ఎలాంటి మార్పులు లేవని అధికారులు చెప్పారు. ప్రతి సోమవారం ఉదయం 5.30 గంటలకే మెట్రో రాకపోకలు ప్రారంభం అవుతాయన్న ప్రచారంలోనూ నిజం లేదన్నారు. ఈ వేళలను అమల్లోకి తీసుకురాలేదని తెలిపారు. ప్రస్తుతం ప్రయాణికుల రద్దీతో పాటు రైళ్లు, ట్రాక్ నిర్వహణ వంటి వాటిపై పరిశీలన చేస్తున్నట్లు వారు మరోమారు ఋస్పష్టం చేశారు.