Wednesday, June 4, 2025

5 కాదు.. 11 ఈనెల 11న ఘోష్‌ ముందు విచారణకు రానున్న కేసీఆర్

కాళేశ్వరం విచారణ కమిషన్ ముందు బీఆర్​ఎస్​ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ హాజరు కావాల్సిన తేదీ మారింది. గతంలో ఆయన ఈ నెల 5న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. తాజాగా కేసీఆర్ విజ్ఞప్తి మేరకు విచారణ తేదీని ఈనెల 11కు మార్చారు. ఈ మేరకు కాళేశ్వరం అక్రమాలపై విచారణ జరుపుతున్న పీసీ ఘోష్‌ కమిషన్ ప్రకటన విడుదల చేసింది. జూన్​ 5న విచారణకు కేసీఆర్​ రావాలని జస్టిస్​ పీసీ ఘోష్​ కమిషన్​ నోటీసుల్లో పేర్కొంది. అలాగే జూన్​ 6న ఎమ్మెల్యే హరీశ్​రావు, జూన్​ 9న ఎంపీ ఈటల రాజేందర్​కు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. ఈ ముగ్గురు కమిషన్​ కార్యాలయంలో విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. ప్రాజెక్టు, ఆనకట్టల నిర్మాణంపై అప్పటి ప్రభుత్వ పెద్దలను సైతం కమిషన్​ విచారించనుంది.

సీఎంగా, కొంతకాలం ఇరిగేషన్​ మంత్రిగా ఉన్న కేసీఆర్​, కొంతకాలం ఇరిగేషన్, ఆర్థిక మంత్రిగా ఉన్న హరీశ్​రావు, కొంతకాలం ఆర్థిక మంత్రిగా ఈటల రాజేందర్​ పని చేశారు. ఎంపీ ఈటల రాజేందర్​ అనంతరం పరిణామాల దృష్ట్యా బీజేపీలో చేరిన కూడా కమిషన్​ విచారణకు పిలిచింది. సహజ న్యాయసూత్రం ప్రకారం ముగ్గురి వాదనలను వినాలని కమిషన్​ నిర్ణయించింది. ముగ్గురి వాగ్మూలాలను పీసీ ఘోష్​ కమిషన్​ రికార్డ్ చేసుకోనుంది.

2024 మార్చి నుంచి 3 బ్యారేజీలపై విచారణ
మేడిగడ్డ బ్యారేజీ కుంగిన నేపథ్యంలో అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ బ్యారేజీలపై విచారణ జరిపేందుకు న్యాయ విచారణ కమిషన్​ను రాష్ట్ర ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్​ పీసీ ఘోష్​ నేతృత్వంలో 2024 మార్చిలో ఏర్పాటైన ఈ కమిషన్​ నిర్మాణం, డిజైన్​, నిర్వహణ, పే అండ్​ ఎకౌంట్స్​, క్వాలిటీ కంట్రోల్​, ఆర్థిక శాఖల ఉన్నతాధికారులు, నీటిపారుదల, నిర్మాణ సంస్థల ప్రతినిధులు, ఇలా ఎందరినో విచారించింది. ఇప్పుడు తాజాగా కేసీఆర్​, హరీశ్​రావు, ఈటల రాజేందర్​లకు నోటీసులు పంపింది. వారు విచారణకు వస్తారేమో ఆ తేదీ వరకు ఆగాల్సిందే.

అలాగే కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగమైన కొండ పోచమ్మసాగర్​ రిజర్వాయర్​ నిర్మాణంలో అక్రమాలు జరిగాయంటూ వచ్చిన ఫిర్యాదుపై విజిలెన్స్​ అండ్​ ఎన్​పోర్స్​మెంట్​ విచారణ ప్రక్రియను ప్రారంభించింది. విచారణలో భాగంగా ఈనెల 26 నుంచి వచ్చే నెల నాలుగో తేదీ వరకు విచారణకు రావాలని ఏకంగా 63 మంది ఇంజినీర్లను పిలిచింది. ఈ విచారణ ఎనిమిది రోజుల పాటు జరగనుండగా, రిజర్వాయర్​ నిర్మాణ సమయంలో పని చేసిన ఏఈఈలు మొదలుకొని ఇంజినీర్​ ఇన్​ చీఫ్​ల వరకు హాజరు కావాల్సి ఉంది. విజిలెన్స్​ అండ్​ ఎన్​ఫోర్స్​మెంట్​ రామచంద్రాపురం యూనిట్​ ఎస్పీ, నీటిపారుదల శాఖ ఇంజినీర్​ ఇన్​ చీఫ్​కు రెండు రోజుల క్రితం లేఖ రాశారు.

ప్ర‌దాన వార్త‌లు

సొంత పార్టీ వాళ్లే ఎంపీగా ఓడించారన్న కవిత వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com