Friday, May 9, 2025

టెక్స్ట్‌ బుక్కులే కాదు.. నోట్‌ బుక్కులు కూడా తెలంగాణ సర్కార్ గుడ్​న్యూస్​

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 1-5 తరగతుల విద్యార్థులకూ ఈసారి నుంచి నోట్​ పుస్తకాలు అందించాలని సర్కార్​ నిర్ణయించింది. ఇంతవరకు 6-10 తరగతుల విద్యార్థులకే వాటిని ఇస్తుండగా, ఇప్పుడు ప్రాథమిక తరగతుల పిల్లలకూ ఇవ్వనున్నారు. దీనివల్ల రాష్ట్రంలో 8.60 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుంది. హైదరాబాద్​లో డీఈవోలతో జరిగిన ఆన్​లైన్​ సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా పలు నిర్ణయాలను వెల్లడించారు. 1-2 తరగతుల విద్యార్థులకు మూడు, 3 – 5 తరగతుల వారికి నాలుగు చొప్పున నోట్​ పుస్తకాలు పంపిణీ చేయనున్నారు. వాటికి వర్క్​బుక్​లతో పాటు నోట్​ పుస్తకాలను కూడా అదనంగా ఇవ్వనున్నారు. ఈ నెల 15 నుంచి వాటిని జిల్లాలకు సరఫరా చేయనున్నారు.
విద్యా శాఖ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఇకపై ప్రతి శుక్రవారం పాఠశాలల్లో తల్లిదండ్రుల సమావేశం నిర్వహించనున్నారు. జూన్​ 6న బడిబాట మొదలవనుండగా, ఆరోజు మెగా పీటీఎం (తల్లిదండ్రుల సమావేశం) నిర్వహిస్తారు.
ప్రస్తుతానికి ఖాన్​ అకాడమీ ద్వారా మోడల్​ స్కూళ్లు, కేజీబీవీల్లో 6 నుంచి 12వ తరగతి వరకు గణితం, సైన్స్​ సబ్జెక్టులను ఆన్​లైన్​లో నేర్చుకునే సదుపాయం ఉండగా, దాన్ని మిగిలిన అన్ని ప్రభుత్వ పాఠశాలలకు విస్తరించనున్నారు. ఈ అకాడమీ ఆన్​లైన్​ ప్లాట్​ఫామ్ ద్వారా నీట్​, జేఈఈ కోచింగ్​ కూడా పొందొచ్చు.
ప్రత్యేక అవసరాల పిల్లల కోసం నడుస్తున్న భవిత కేంద్రాల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పనకు ప్రతిపాదనలు పంపితే నిధులు మంజూరు చేస్తారు.
కలెక్టర్లను సంప్రదించి ఏఐ ల్యాబ్​ల ఏర్పాటుకు అవసరమైన వసతులున్న పాఠశాలలను డీఈవోలు గుర్తించాల్సి ఉంది. యూడైస్​ గణాంకాలపై ఇటీవల డైట్​ విద్యార్థులు పరిశీలన జరపగా పలు వ్యత్యాసాలు గుర్తించారు. అయితే ప్రధానోపాధ్యాయులు వాటిని వెంటనే సవరించి యూడైస్​ పోర్టల్​లో అప్​డేట్​ చేయాల్సి ఉంది.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com