Tuesday, May 13, 2025

తెలుగు రాష్ట్రాలకు విరాళాలు

ఎన్టీఆర్ రూ.కోటి, విశ్వక్‌సేన్ పది లక్షల

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయనిధికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ రూ.కోటి విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. ‘రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జరుగుతున్న వరద బీభత్సం నన్ను ఎంతగానో కలచివేసింది. అతిత్వరగా ఈ విపత్తు నుంచి తెలుగు ప్రజలు కోలుకోవాలని నేను ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు నా వంతుగా చెరొక రూ.50 లక్షలు విరాళమిస్తున్నా’ అని తెలిపారు.

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్‌సేన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెరో రూ.5లక్షల విరాళం ప్రకటించారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించనున్నట్లు వెల్లడించారు. ఈ విపత్తు సమయంలో సహాయక చర్యలకు మద్దతుగా ఈ విరాళం ఇస్తున్నానని అన్నారు. తన అభిమాన హీరో అయిన జూ.ఎన్టీఆర్ విరాళం ప్రకటించిన కాసేపటికే విశ్వక్ ఈ ప్రకటన చేయడం గమనార్హం.

అంతకుముందు ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్ కు తన వంతుగా రూ. 25 లక్షలు విరాళం ప్రకటించారు. నిన్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య తెలుగు రాష్ట్రాలకు రూ, 10 లక్షల విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com